Home / తాజా వార్తలు
ప్రజలు తమ వివాహాన్ని ఒక చిరస్మరణీయమైన దినంగా జరుపుకోవాలని కలలు కంటారు. దీనికోసం కొందరు విలాసవంతమైన పార్టీలు చేస్తారు. మరికొందరు ఆకర్షణీయమైన దుస్తులను ధరిస్తారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక జంట ఒక ప్రత్యేకమైన వెడ్డింగ్ కార్డ్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) చైర్మన్గా సమీర్ వి కామత్ను నియమించారు. డిఆర్డిఓలో నావల్ సిస్టమ్స్ & మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్గా ఉన్న కామత్, జి సతీష్ రెడ్డి స్థానంలో నియమితులయ్యారు.
ఆదివారం (ఆగస్టు 28) కూల్చివేయబోతున్న నోయిడా సూపర్టెక్ ట్విన్ టవర్ల నిర్మాణ వ్యయంమొత్తం రూ.70 కోట్లు. అయితే, దాని కూల్చివేత కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, దీనికి చాలా పేలుడు పదార్థాలు, మానవశక్తి మరియు పరికరాలు అవసరం.
ద్వేషపూరిత ప్రసంగాల కేసులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ఆయనను ప్రాసిక్యూట్ చేయాలంటూ దాఖలైన దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. 2007లో ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ దరఖాస్తు దాఖలైంది.
ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల ఉచిత ప్రకటనలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు, ఆ అంశాన్ని శుక్రవారం త్రిసభ్య ధర్మాసనానికి నివేదించింది. విచారణ సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం "ఎన్నికల ప్రజాస్వామ్యంలో, నిజమైన అధికారం
మార్కెట్లో యాపిల్ ప్రొడక్ట్స్ ఉన్న క్రేజ్ ఇంకా ఏ ప్రొడక్ట్స్ కు లేదు. ఇప్పుడు యాపిల్ కొత్త ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ ఈవెంట్ డేటాను ఖరారు చేసింది. ఈ ఈవెంట్లో ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేయనున్నారు. ఫార్ ఔట్ పేరుతో ఈ లాంచ్ పేరుతో ఈ ఈవెంట్ను నిర్వ హించనున్నట్లు తెలుస్తుంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరియ జమ్ముకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల, అతను రాబోయే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించారు.
హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో జరిగే సభకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది. పోలీసుల తీరును సవాల్ చేస్తూ బీజేపీ శ్రేణులు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. రేపు ఆర్ట్స్ కళాశాలలో బీజేపీ సభ జరగాల్సి ఉంది.
డు పాతబస్తీలో శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఓ వర్గం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అలర్లు సంభవించకుండా పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు.
లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు వరకు సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి . సినిమా పై ఉన్న అంచనాల వలన 4 రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.