Last Updated:

Phone tapping case: ఎన్ఎస్ఇ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణను అరెస్ట్ చేసిన ఈడీ

అక్రమ ఫోన్ ట్యాపింగ్ మరియు స్నూపింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోర్టు నుంచి అనుమతి లభించడంతో ఏజెన్సీ రామకృష్ణను అరెస్టు చేసారు.

Phone tapping case: ఎన్ఎస్ఇ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణను అరెస్ట్ చేసిన ఈడీ

New Delhi: అక్రమ ఫోన్ ట్యాపింగ్ మరియు స్నూపింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.

ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోర్టు నుంచి అనుమతి లభించడంతో ఏజెన్సీ రామకృష్ణను అరెస్టు చేసారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సమాచారంఅరెస్టు తర్వాత, కోర్టు రామకృష్ణను నాలుగు రోజుల కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు పంపింది.

విజిల్-బ్లోయర్’ ద్వారా వెలుగులోకి వచ్చిన తర్వాత 2015 ప్రారంభంలో కోలొకేషన్ విషయంపై సెబీ తన దర్యాప్తును ప్రారంభించింది. కొంతమంది బ్రోకర్లు కో-లొకేషన్ సౌకర్యం, ముందస్తు లాగిన్ మరియు ‘డార్క్ ఫైబర్’ ద్వారా ప్రిఫరెన్షియల్ యాక్సెస్‌ను పొందుతున్నారని ‘విజిల్-బ్లోయర్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: