Last Updated:

Sudan clashes: సూడాన్ ఆర్మీ మరియు ఆర్‌ఎస్‌ఎఫ్ ఘర్షణల్లో 56 మంది పౌరుల మృతి.. 595 మందికి గాయాలు

సూడాన్ లో మిలిటరీ మరియు రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్ ) పారామిలిటరీ మధ్య జరిగిన ఘోరమైన ఘర్షణల ఫలితంగా కనీసం 56 మంది పౌరులు మరణించారు. 595 మంది గాయపడ్డారు.సూడాన్ డాక్టర్స్  యూనియన్ ఒక ట్వీట్‌లో ఘర్షణల ఫలితంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించగా పలువురికి గాయాలు సంభవించాయని పేర్కొంది.

Sudan clashes: సూడాన్ ఆర్మీ మరియు ఆర్‌ఎస్‌ఎఫ్ ఘర్షణల్లో 56 మంది పౌరుల మృతి.. 595 మందికి గాయాలు

Sudan clashes: సూడాన్ లో మిలిటరీ మరియు రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్ ) పారామిలిటరీ మధ్య జరిగిన ఘోరమైన ఘర్షణల ఫలితంగా కనీసం 56 మంది పౌరులు మరణించారు. 595 మంది గాయపడ్డారు.సూడాన్ డాక్టర్స్  యూనియన్ ఒక ట్వీట్‌లో ఘర్షణల ఫలితంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించగా పలువురికి గాయాలు సంభవించాయని పేర్కొంది. 595 మంది గాయపడ్డారని వీరి పరిస్దతి విషమంగా ఉందని పేర్కొంది. మరణించిన వారిలో ముగ్గురు ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) UN సిబ్బంది అని నివేదికలు సూచిస్తున్నాయి.సూడాన్ సైన్యం తన జెట్‌లు ఆర్ఎస్ఎఫ్ సైట్‌లపై బాంబు దాడి చేస్తున్నాయని పేర్కొంది నివాసితులు శనివారం రాత్రి తమ ఇళ్లలోనే ఉండాలని సూచించింది.

పారామిలటరీపై మిటలరీ దాడులు..(Sudan clashes)

ఖార్టూమ్‌లోని సోబాలోని శిబిరాల్లోకి సైన్యం పెద్ద సంఖ్యలో ప్రవేశించి అక్కడ పారామిలిటరీలను ముట్టడించడంతో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఆశ్చర్యానికి లోనయింది. సైన్యం అన్ని రకాల భారీ మరియు తేలికపాటి ఆయుధాలతో భారీ దాడిని ప్రారంభించిందని పేర్కొంది.సూడాన్ సైన్యం మరియు ఆర్‌ఎస్‌ఎఫ్ మధ్య శనివారం ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో దేశంలోని భారతీయులు ఇంటి లోపలే ఉండమని సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది.ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంట్లోనే ఉండండి మరియు తక్షణ ప్రభావంతో బయటికి వెళ్లడం మానేయాలని కోరింది. దయచేసి ప్రశాంతంగా ఉండండి మరియు అప్ డేట్ల కోసం వేచి ఉండండని తెలిపింది. ఈ నెల ప్రారంభంలో, సైనిక పునర్వ్యవస్థీకరణపై చర్చలు విఫలమైనందున పౌర పరిపాలనను స్థాపించడానికి ఒప్పందంపై సంతకం చేయడం సుడానీస్ అధికారులచే ఆలస్యం చేయబడిందని నివేదికలు తెలిపాయి.

మిలిటరీ పాలకుడు జనరల్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్ మరియు ఆర్‌ఎస్‌ఎఫ్ అధినేత మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య విభేదాలు ఉన్నాయి.అక్టోబర్ 2021లో, సూడాన్  మిలిటరీ తిరుగుబాటు చేసి పౌర ప్రభుత్వాన్ని పడగొట్టి, దేశాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. సైనిక నేతృత్వంలోని పరివర్తన ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం నుండి విస్తృత నిరసనలు మరియు ఖండనలను ఎదుర్కొంది.