Home / తాజా వార్తలు
ప్రపంచంలోని టాప్ 25 కంపెనీలకు ఇండియన్స్ సీఈవోలుగా పనిచేస్తున్నారు. అదే మన పిల్లలు ఆకలితో చస్తున్నారని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సయ్యద్ ముస్తాఫా కమల్ అనే ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నాడు ఆయన నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ విద్యా వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది . ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మే 15వ తేదీ వరకు 6.99 కోట్ల పనిదినాలను ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఏపీ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలబడింది.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ పర్సన్గా కెరీర్కు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు డేట్ ఉంటుంది. దానిని ఊహించుకుంటూ కాకుండా... మనం చేయగలిగిన దానిపైనే దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
ఫోర్బ్స్ గురువారం నాడు 30 అండర్ 30 ఆసియా జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఏషియా - పసిఫిక్ రీజియన్లో మొత్తం 300 మంది యువ ఎంటర్ప్రెన్యుర్స్, లీడర్స్, ట్రెయిల్ బ్లేజర్స్ స్థానం దక్కించుకున్నారు. వీరంతా వివిధరకాల వినూత్న వ్యాపారాలు, పరిశ్రమల వ్యవస్థాపకులు.
ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు కదా! ఇండియాకు చెందిన ఓ వ్యాపారి తన లగ్జరీ కారు రేంజి రోవర్ను కేరళ నుంచి దుబాయికి తీసుకువెళ్లి ప్రపంచంలోనే అత్యంతఎత్తైన ఆకాశహర్మ్యం బుర్జ్ ఖలీఫా ముందు పార్క్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం చాలా మంది యూ ట్యూబ్ చానల్స్ పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో అర్మాన్ మాలిక్ ఒకరు. ఆయన లైప్ స్టయిల్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే ఆయన ఇటీవల సిద్దార్ధ కన్నన్ షోలో ప్రత్యక్షమయ్యారు.
అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత భారతీయ జనతాపార్టీ సీతమ్మకు దేవాలయం కట్టి ఓట్లు దండుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం లోకసభ ఎన్నికల సీజన్ కొనసాగుతోంది. ఐదవ విడత ప్రచారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిహార్లో పర్యటిస్తున్నారు.
ఏపీలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిల్చిపోయిన సంక్షేమ పథకాల నిధులు తాజగా విడుదలయ్యాయి. ఆసరా పథకానికి రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్ కోసం రూ.502 కోట్లు విడుదలయ్యాయి.
ఏపీలో ఇసుక మైనింగ్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టులోనూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది.
వైసీపీ డీఎన్ఏ లోనే హింస ఉందని మరోసారి రుజువు అయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని అన్నారు. 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.