Home / తాజా వార్తలు
ప్రేమ గుడ్డిది, హద్దులు చూడదు అంటారు. అస్సాంలోని ఒక టీనేజ్ అమ్మాయి తన ప్రేమను నిరూపించుకోవడానికి చేసిన విపరీత చర్య చూసాక ఈ సామెత గుర్తుకు రాక మానదు. అసోంలోని సుల్కుచి జిల్లాలో 15 ఏళ్ల బాలిక తన ప్రేమను గొప్పగా చాటుకునే ప్రయత్నంలో తన ప్రియుడి హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించింది.
మంగళవారం ఉదయం ముంబయిలోని రాజ్భవన్లో జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మొదటి దశలో 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మంత్రులతో ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి మంత్రి మండలిలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గిరీష్ మహాజన్,
బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్ ఫాగు చౌహాన్ను కలిసేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమయం కోరినట్లు సమాచారం. ఈ సమావేశం మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంటల మధ్య జరగొచ్చు. ఆయనతో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా కలిసే అవకాశముంది. మరోవైపు రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ చెందిన మంత్రులు
మతసామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఇవాళ్టి నుంచి 13వ తేదీ వరకు జరగనుంది. రెండేళ్ల తర్వాత పండుగ జరుగుతుండటంతో దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. అందుకు తగినట్లుగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. దీంతో దర్గా ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది.
గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలపై విచారణ జరుగుతోందని రిపోర్టులు వచ్చాకే చర్యలుంటాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాధవ్ వేధించినట్లు ఏ మహిళా ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దదన్నారు సజ్జల
కామన్వెల్త్ క్రీడల్లో చివరి రోజూ భారత క్రీడాకారులు అదరగొట్టారు. వెయిట్లిఫ్టర్లు, రెజ్లర్లు, బాక్సర్ల తరహాలోనే షట్లర్లు సైతం చక్కటి ప్రదర్శన చేయడంతో బర్మింగ్హామ్ క్రీడలను భారత్ ఘనంగా ముగించింది. చివరి రోజు మరో నాలుగు స్వర్ణాలు భారత్ ఖాతాలో జమ అయ్యాయి. అందులో మూడు బ్యాడ్మింటన్లో వచ్చినవే.
యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును ప్రకటించారు సెలక్టర్లు. ఆసియా కప్ టోర్నీకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులోకి వచ్చాడు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్పై ఈడీ సీరియస్ అయ్యింది. శివసేనకు చెందిన సామ్నా అనే పత్రికలో వారం వారం రోక్ తక్ అనే కాలాన్ని సంజయ్ రౌత్ రాస్తుంటారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నందున జైలు నుంచి వారం వారం కాలం రాసే అవకాశం లేదు. అయితే ఆదివారం సామ్నా పత్రికలో కూడా రౌత్ కాలం ప్రచురితమైంది.
గ్రేటర్ నోయిడాలో ఈ రోజు బుల్డోజర్లు యాక్షన్లోకి దిగాయి. బీజేపీ కిసాన్ మోర్చాకు చెందిన శ్రీకాంత్ త్యాగి అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఇటీవలే త్యాగి నివసించే గ్రాండ్ ఒమాక్స్ సొసైటీకి చెందిన ఓ మహిళను దర్భాషలాడ్డంతో పాటు చేయిచేసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ రోజుతో తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ హోదాలో చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని సభ్యులకు సూచించడంతో పాటు తన అనుభవాలనూ పంచుకున్నారు.