Home / ప్రాంతీయం
చంద్రబాబు అధికారం అనే ఆకలితో అలమటిస్తున్నారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. 1978లో. చంద్రబాబు ఇంటి పెంకులు కూడా వేయించుకునే స్థితిలో లేరు. ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు అయిపోయారు. ఈ సంపాదన ఎలా సాధ్యపడింది..?మాకు కూడా చెప్తే రాజకీయాలు వదిలేసి మేము కూడా సంపాదించుకుంటామని ముద్రగడ అన్నారు.
చిత్తూరు జిల్లాలో మరోసారి వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అధికార పార్టీ అండదండలతో ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థి అయిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్పై దాడికి తెగబడ్డారు. ప్రచార రథానికి నిప్పు పెట్టారు. సదుం పోలీస్ స్టేషన్ ముందే బీసీవై పార్టీ ప్రచార వాహనాన్ని వైసీపీ శ్రేణులు తగలబెట్టారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు.
ఏపీలో టీడీపీ-జనసేన కూటమికి గాజు గ్లాస్ గుర్తు టెన్షన్ ఇంకా పోలేదు .ఇటీవల గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట్ల ఇతరులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించరు. జనసేన 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోందని, ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని స్థానాల్లో ఇతరులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని కొంతమంది ఈసీకి విన్నవించారు
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టులోకి చిరుత చొరబడడంతో కలకలం రేగింది. గొల్లపల్లి వైపు నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్పోర్టు లోపలికి వచ్చిందని తెలుస్తుంది .ఏప్రిల్ 28 తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది . చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మించిన తర్వాత తొలిసారిగా ఒక అంతర్జాతీయ ప్రయాణికుల నౌక విశాఖ చేరుకుంది. ఏప్రిల్ 28 న 80మంది ప్రయాణికులతో 'ది వరల్డ్' అనే క్రూయిజ్ షిప్ పోర్టు లోని ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ కు చేరుకుంది .' ఈ నౌక లగ్జరీ విభాగానికి చెందినది.
తెలుగుదేశం యువనేత జనరల్ సెక్రటరీ నారా లోకేష్ మరోసారి యువగళం యాత్ర చేపట్టనున్నారు. గతంలో కుప్పం నుంచి విశాఖ వరకు యువగళం పాదయాత్ర ద్వారా శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిన లోకేష్ ... ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మిగిలిన ప్రాంతాలలో పర్యటించనున్నారు . ఏప్రిల్ 30 న ఒంగోలు నుంచి మలివిడత యువగళం యాత్ర ప్రారంభించి మే 6న ముగించనున్నారు.
ఏపీలో ఎన్నికల నేపధ్యంలో అనేక విషయాలపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శ ప్రతివిమర్శలు పొడచూపుతున్నాయి .తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విస్తృత మైన చర్చ జరుగుతోంది. ఆ చట్టం ద్వారా రైతుల భూములు, ఆస్తులు లాక్కునేందుకు కుట్రపన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29 న ఈ చట్టం పై రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు.
తెలంగాణాలో బీఆర్ఎస్ మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్రెడ్డి కాంగ్రెస్పార్టీ లో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ను జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో అమిత్రెడ్డి కలిశారు.
చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.
హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. ఎంఐఎంకు కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో బీజేపీ కె మాధవీలతను బరిలో నిలిపింది. హైదరాబాద్లోని అతి పెద్ద ఆస్పత్రి విరంచికి ఆమె డైరెక్టర్.. తన ఎన్నికల అఫిడవిట్లో ఆమె ఆస్తి రూ.221 కోట్లుగా ప్రకటించారు. కాగా ఆమె పాత బస్తీలోని పేద మహిళలను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వారికి ఉచితంగా వైద్య సేవలందించారు