Home /Author anantharao b
హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు. 1956లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారని విద్యాసాగర్ రావు తెలిపారు. హైదరాబాద్ దేశానికి తలమానికమన్నారు.
విడుదలకి ముందే సినిమా పాత్రల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆదిపురుష్ సినిమా ఇప్పుడు న్యాయ పరమైన వివాదాల్లో చిక్కుకుంది. ఆదిపురుష్ సినిమాపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు ఈ పిల్ దాఖలు చేశారు.
నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చించారు. ఖమ్మం, నల్గొండ సభలకు ప్రియాంకను కోమటిరెడ్డి ఆహ్వానించారు. అనంతరం సోనియాగాంధీని కలిసి తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చించారు.
బిపర్ జోయ్ తుఫాను ప్రభావంతో గుజరాత్ లో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం మరియు గంటకు 115-125 కిలోమీటర్ల (కిమీ) వేగంతో గాలులు వీచాయి. వీటి ప్రభావంతో వందలాది చెట్లు కూలిపోయాయి, కమ్యూనికేషన్ టవర్లు దెబ్బతిని విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.
200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ ఒడిశా రైలు ప్రమాదానికి రూ.10 కోట్లు ఆఫర్ చేశాడు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు రాసిన లేఖలో చంద్రశేఖర్ విరాళం ఇవ్వడానికి అనుమతిని కోరాడు, ఆ మొత్తాన్ని తన సక్రమమైన మరియు పన్ను విధించిన ఆదాయం అని పేర్కొన్నాడు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనల నుంచి రూపు దాల్చిన సంస్దలు IIIT RGUKT.. రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. గ్రామీణ ప్రాంతాల విద్యార్దులు కేవలం టెన్త్ క్లాస్ మార్కులతో ప్రతిష్టాత్మక సంస్దల్లో ఇంజనీరింగ్ డిగ్రీని చదువుకునే విధంగా వీటిని స్దాపించారు.
మణిపూర్ రాజధాని ఇంఫాల్లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్కె రంజన్ సింగ్ నివాసాన్ని గురువారం అర్థరాత్రి ఒక గుంపు తగలబెట్టిందని మణిపూర్ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు.
తెలంగాణకి చెందిన 152మంది పౌరహక్కులు, విప్లవ సంఘాల బాధ్యులు, మేధావులపై ఉపా చట్టంకింద కేసు నమోదయింది. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీరిలో పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఉన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకర్గం చేబ్రోలులో సెరీ కల్చర్ రైతులు, చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. చేనేత కార్మికులు తమ సమస్యలను పవన్కు వివరించారు. సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడంతో నష్టపోతున్నామని నేతన్నలు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) గురువారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా నీరు, విద్యుత్, వ్యవసాయోత్పత్తులకు సరైన ధర కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం పిలుపునిచ్చారు.