Last Updated:

Disproportionate Assets Case: ఆదాయానికి మించి ఆస్తులు.. వాప్కోస్ మాజీ సీఎండి రాజిందర్ గుప్తాపై సీబీఐ కేసు నమోదు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై వాప్కోస్ మాజీ సీఎండి రాజిందర్ గుప్తా మరియు అతని కుటుంబ సభ్యులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కేసు నమోదు చేసింది. వీరికి సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

Disproportionate Assets Case: ఆదాయానికి మించి ఆస్తులు.. వాప్కోస్ మాజీ  సీఎండి రాజిందర్ గుప్తాపై సీబీఐ కేసు నమోదు

Disproportionate Assets Case: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై వాప్కోస్ మాజీ సీఎండి రాజిందర్ గుప్తా మరియు అతని కుటుంబ సభ్యులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కేసు నమోదు చేసింది. వీరికి సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

భారీగా పెరిగిన  ఆస్తులు..(Disproportionate Assets Case)

నిందితులకు సంబంధించి ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, సోనిపట్ మరియు ఘజియాబాద్‌లోని 19 ప్రాంతాసోదాలు నిర్వహించగా, రూ. 20 కోట్ల నగదు, భారీ మొత్తంలో నగలు, విలువైన వస్తువులు మరియు నేరారోపణ పత్రాలు రికవరీ చేయబడ్డాయి. ఏప్రిల్ 1, 2011 నుండి మార్చి 31, 2019 వరకు నిందితుడు తన ఆదాయ వనరులకు మించి ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారని సీబీఐ పేర్కొంది.

ప్రైవేట్ కంపెనీ పేరుతో కన్సల్టెన్సీ సేవలు..

రాజిందర్ గుప్తా సర్వీసు నుంచి రిటైర్ అయిన తర్వాత ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో కన్సల్టెన్సీ వ్యాపారం ప్రారంభించారని సీబీఐ ఆరోపించింది. నిందితులకు చెందిన స్థిరాస్తుల్లో ఫ్లాట్లు, వాణిజ్యపరమైన ఆస్తులు, ఢిల్లీ, గురుగ్రామ్, పంచకుల, సోనిపట్ మరియు చండీగఢ్‌లో విస్తరించి ఉన్న ఫామ్‌హౌస్ ఉన్నాయి.నిందితులు రాజిందర్ కుమార్ గుప్తా, అతని భార్య రీమా సింగల్, కుమారుడు గౌరవ్ సింగల్, కోడలు కోమల్ సింగల్‌లపై కేసు నమోదు చేశారు.

వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (WAPCOS) అనేది జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వ సంస్థ.గత 5 దశాబ్దాలుగా భారతదేశం మరియు విదేశాలలో నీరు, విద్యుత్ మరియు మౌలిక సదుపాయాల రంగాలలో ప్రాజెక్ట్‌ల కోసం ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సేవలను అందిస్తోంది.పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగం ద్వారా షెడ్యూల్ B కేటగిరీ-I మినీ-రత్న హోదా ప్రధానం చేసారు.