Published On:

BSNL: గుక్క తిప్పుకోనివ్వని BSNL.. కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లు.. జియో, ఎయిర్టెల్‌లకు షాకులే షాకులు..!

BSNL: గుక్క తిప్పుకోనివ్వని BSNL.. కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లు.. జియో, ఎయిర్టెల్‌లకు షాకులే షాకులు..!

BSNL: ప్రభుత్వ సంస్థ BSNL గత 6-7 నెలలుగా టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రైవేట్ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచినప్పటి నుండి, BSNLకి మంచి రోజులు తిరిగి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ రంగంలో BSNL ఎలా పునరాగమనం చేసిందో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిన సమాచారం నుండి అంచనా వేయచ్చు. గత ఆరు నెలల్లో 55 లక్షల మంది కొత్త కస్టమర్లను బిఎస్‌ఎన్‌ఎల్ చేర్చుకున్నట్లు కేంద్ర మంత్రి పార్లమెంటులో తెలిపారు.

 

బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి రాజ్యసభలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థను లాభాల్లోకి తీసుకురావడానికి,దాని చందాదారుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. గత ఏడాది జూన్‌ నుంచి ఫిబ్రవరి 2025 వరకు తొలిసారిగా కంపెనీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 8.55 కోట్ల నుంచి 9.1 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

 

వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ సేవలను నిరంతరం మెరుగుపరుస్తున్నామని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ సంస్థ ఏప్రిల్ నెలను ‘కస్టమర్ సర్వీస్ మంత్’గా జరుపుకోవాలని ప్రకటించింది. ఈ నెల మొత్తంలో కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్ల నుండి అభిప్రాయాన్ని తీసుకుంటుంది, వారి అనుభవం ప్రకారం మెరుగైన సేవలను అందించడానికి సిద్ధం అవుతుంది. కంపెనీకి చెందిన అన్ని సర్కిళ్లు, యూనిట్లు ఇందులో పాల్గొంటాయని బీఎస్ఎన్ఎల్ స్వయంగా తెలిపింది.

 

‘కస్టమర్ సర్వీస్ మంత్’ జరుపుకోవడం వెనుక ఉన్న అతిపెద్ద లక్ష్యం మొబైల్ నెట్‌వర్క్ నాణ్యతను మెరుగుపరచడం, బ్రాడ్‌బ్యాండ్ పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంచడం. ఈ నెల మొత్తం కంపెనీ తన వెబ్‌సైట్, సోషల్ మీడియా ద్వారా వినియోగదారుల నుండి అభిప్రాయాన్ని తీసుకుంటుంది. కస్టమర్ల నుండి స్వీకరించిన అభిప్రాయాన్ని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ సమీక్షిస్తారు.

 

బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్‌ను నిరంతరం మెరుగుపరుచుకుంటుంది. 2025 జూన్ నాటికి లక్ష 4జీ టవర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. దాదాపు 80 వేల టవర్ల పనులు పూర్తి చేశామని, త్వరలోనే మిగిలిన టవర్ల పనులు కూడా పూర్తి కానున్నాయి. 4జీ టవర్ల పనులు పూర్తయిన వెంటనే ప్రభుత్వ సంస్థ 5జీ నెట్‌వర్క్‌పై పని చేస్తుంది. బీఎస్ఎన్ఎల్ 4G టవర్లు పూర్తిగా స్వదేశీవి, వాటిని 5Gకి మార్చగలిగే విధంగా రూపొందించారు.