Home / Uttarakhand
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉత్తరాఖండ్లో పర్యటించారు. అతను శివుని పవిత్ర నివాసంగా భావించే ఆది కైలాస శిఖరం నుండి తన పర్యటనను ప్రారంభించారు. పార్వతి కుంద్ లోని ఆది కైలాస శిఖరం వద్ద ప్రార్థనలు చేశారు. తెల్లటి వస్త్రాలు ధరించిన మోదీ స్దానిక పూజారులు వీరేంద్ర కుటియాల్ మరియు గోపాల్ సింగ్ ల సూచనల మేరకు పూజలు నిర్వహించారు.
ఉత్తరాఖండ్లోని మాల్దేవ్తాలోని డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం సోమవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య కుప్పకూలింది. భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు, దుకాణాలు ధ్వసం అయ్యాయి. 19 మంది గల్లంతు కాగా వీరిలో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 16 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో అలకనంద నది ఒడ్డున ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.నమామి గంగే మురుగునీటి శుద్ధి కర్మాగారం ప్రాజెక్ట్ స్థలంలో పనిచేస్తున్న ఇరవై మందికి పైగా ఉద్యోగులు విద్యుదాఘాతానికి గురయ్యారు.
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న వరదల నేపధ్యంలో హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ లో జనజీవనం అస్తవ్యస్తమయింది. ప్రతికూల వాతావరణం కారణంగా మరణించిన వారి సంఖ్య హిమాచల్ ప్రదేశ్లో 90కి చేరుకుంది. గత నాలుగు రోజుల్లో 39 మరణాలు నమోదయ్యాయి.
భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఉత్తర భారతదేశం లో మరో 20 మరణాలు నమోదయ్యాయి. దీనితో వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 100 కు చేరింది.హిమాచల్ ప్రదేశ్లో మంగళవారం నాటికి మృతుల సంఖ్య 31కి చేరింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 80 మంది మరణించారు
ఉత్తర భారతంలోదేశరాజధాని ఢిల్లీతో సహా పంజాబ్ , హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి.ఢిల్లీ ఎన్సిఆర్కి ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేశారు, దేశ రాజధాని ప్రాంతం అంతటా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు ఐఎండి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. పంజాబ్ మరియు హర్యానా లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసారు.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో పెరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలపై ఆందోళనను తెలియజేస్తూ జమియత్ ఉలమా-ఇ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ అసద్ మదానీ మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి లేఖ రాశారు.
గవర్నమెంట్ ఉద్యోగులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విధులకు రాకుండా ఎక్కువకాలం సెలవులో ఉన్న టీచర్లతో రిటైర్మెంట్ చేయించనుంది. వారి స్థానంలో కొత్తగా నియమాకాలు చేపట్టనుంది.
: ఉత్తరాఖండ్లోని పితోర్ఘర్ జిల్లాలో ఒక ప్రధాన రహదారి కొండచరియలు విరిగిపడటంతో కనీసం 300 మంది ప్రయాణీకులు చిక్కుకుపోయారు. ధార్చుల ఎగువన 45 కిలోమీటర్ల దూరంలోని లఖన్పూర్లో ఉన్న లిపులేఖ్-తవాఘాట్ మార్గం 100 మీటర్ల మేర కొట్టుకుపోయి, రోడ్డుపై పడడంతో ప్రయాణికులు ధార్చుల మరియు గుంజిలో చిక్కుకున్నారని జిల్లా యంత్రాంగం తెలిపింది.