Home / Uttar Pradesh
ఉత్తరప్రదేశ్లో ఓ గ్రామంలోని పెళ్లిలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికి వచ్చిన అతిథులు ఆధార్ కార్డు చూపిస్తేనే విందు భోజనం పెడతామంటూ పెళ్లికూతురి కుటుంబం శరతు పెట్టింది. మరి ఇలా వారు ఆ వింతైన శరతు ఎందుకు పెట్టారో ఓ సారి చూసేద్దామా..
ఉత్తరప్రదేశ్లో నేరాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని చెప్పవచ్చు. మొన్నామధ్య మైనర్ దళిత బాలికలైన అక్కాచెళ్లెల్లపై అత్యాచారం చేసి చెట్టుకు వేలాడదీసిన ఘటన మరువకముందే అదే తరహా ఘటన మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని మొరాదాబాద్ జిల్లా ఓ మైనర్ బాలికపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఆ బాలిక సృహలోకి వచ్చిన తర్వాత రక్తం కారుకుంటూ నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ తన ఇంటికి చేరుకుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోవిలువైన వక్ఫ్ ఆస్తులను భూ మాఫియాలు స్వాధీనం చేసుకున్నారనే ఫిర్యాదులపై చర్య తీసుకునేందుకు సర్వే ప్రారంభించినట్లు యుపి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం చెప్పారు.
తెలంగాణ ప్రజలకు దక్షిణ మద్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రా, మధ్య ప్రదేశ్ ప్రాంతాలను కలుపుతూ 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో 200 మందికి పైగా కబడ్డీ ఆటగాళ్లకు స్టేడియం టాయిలెట్లో ఉంచిన ప్లేట్ల నుండి అన్నం వడ్డించినట్లు ఆరోపణలు వచ్చాయి,
అయోధ్య సమీపంలో ఒక వ్యక్తి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు గుడి కట్టి పూజలు చేస్తున్నాడు. అయోధ్య-గోరఖ్పూర్ హైవే పై భరత్కుండ్ సమీపంలోని యోగి ఆదిత్యనాధ్ ఆలయం ఉంది. మౌర్య అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని దిల్కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని ఒక కార్మికుడు యజమాని తనకు చెల్లించవలసిన మొత్తాన్ని పూర్తిగా ఇవ్వలేదంటూ కోటి రూపాయల మెర్సిడెస్ కారుకు నిప్పు పెట్టాడు. రణ్వీర్ అనే కార్మికుడు ఒక ఇంట్లో టైల్స్ అమర్చాడు.
ఉత్తరప్రదేశ్ లో సోమవారం అర్థరాత్రి ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. కటిక చీకటిలో ప్రకాశవంతంగా వెలుగుతూ ఓ నక్షత్రాల గొలుసు( కదులుతున్న రైలు) లాంటి ఆకారం కదులుతూ అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.
కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ మరియు వారణాసిలోని ఆలయ సముదాయానికి భద్రత మరియు నిఘా అవసరాలను విశ్లేషించడానికి మరియు నిర్ణయించడానికి ప్రభుత్వం ప్రత్యేక భద్రతా కన్సల్టెన్సీ వింగ్ సిఐఎస్ఎఫ్ ను నియమించిందని అధికారిక వర్గాలు తెలిపాయి.