Home / Transfer
హైదరాబాద్ పోలీసు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని మొత్తం సిబ్బందిని మార్చివేసారు. . ఇన్ స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకు మొత్తం 85 మంది సిబ్బందిని హైదరాబాద్ బదిలీ చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తీహార్ జైలులో ఇద్దరు గ్యాంగ్ స్టర్లు ప్రత్యర్దుల దాడిలో మరణించిన తరువాత భద్రతా ఏర్పాట్లపై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తిన నేపధ్యంలో జైళ్ల శాఖ భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా 80 మంది అధికారులను బదిలీ చేశారు.