Home / Tirupati
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయంలోని ధ్వజ స్తంభం దగ్గర వందల ఏళ్ల నాటి పెద్ద రావి చెట్టు ఉంది. ఈ రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కుప్ప కూలింది. ఆకస్మాత్తుగా చెట్టు కూలడంతో ఒకరు మృతి చెందారు.
ప్రయాణీకుల రద్ధీతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణించేందుకు రిజర్వేషన్ టిక్కెట్లు దొరకడమే నానా కష్టంగా మారింది. ఈ క్రమంలో భాగ్యనగర ప్రజలకు దక్షిణ రైల్వే తీపి కబురు చెప్పింది. ఈ నెల 12 నుండి 16 వరకు 6 ప్రత్యేక రైళ్లు హైదరాబాదు మీదుగా వెళ్లనున్నట్లు ప్రకటించింది
తోన్మాదుల వ్యతిరేకంగా నడుంబిగించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపిఐ) యంగ్ కమ్యూనిస్ట్ ఫ్లాగ్ మార్చ్ నాయుడుపేటకు చేరుకొనింది. విజయవాడలో జరగుతున్న 24వ జాతీయ మహా సభల నేపధ్యంలో కేరళ కొల్లం నుండి ప్లాగ్ మార్చ్ ను సీపిఐ చేపట్టింది
భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తెలుగు, తమిళుల ఆరాధ్య దేవత శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకొన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తిరుపతి జిల్లాలో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డిని పేదల పక్షపాతిగా టిటిడి బోర్డు మెంబరు కిలివేటి సంజీవయ్య అభివర్ణించారు. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా పేర్కొన్నారు.
దివంగతులైన పెద్దలను స్మరించుకొనే దినాల్లో మహాలయ అమావాస్య ఒకటి. పితృదేవతలను తలచుకుంటూ పేదలకు అన్నదానం చేస్తే వారు స్వర్గ లోప ప్రాప్తిని చేరుకొంటారనేది ఓ భావన. ఈ క్రమంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్యవైశ్య సంఘం ఓ వృద్ధాశ్రమంకు ఫలసరుకుల అందచేసి పెద్దలను స్మరించుకొన్నారు.
నేటి సమాజంలోని పెళ్లికి ముందు ప్రేమలు కామన్ అయిపోయాయి. అయితే అది పెళ్లయిన తర్వాత బ్రేక్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో పెళ్లైనాక కూడా చాటుమాటుగా ప్రేయసితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుంటారు మరికొందరు. అయితే అది బయటపడిన రోజు భార్యలు చేసే గొడవ అంతా ఇంత కాదు. ఇంక భర్త వేరే వాళ్లతో చనువుగా ఉంటున్నాడంటేనే రచ్చరచ్చ చేసే భార్యలున్న నేటి కాలంలో ఓ ఆడపడుచు తన భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకుని... భర్తకు ప్రేయసిని ఇచ్చి మరల పెళ్లిచేసింది ఈ భార్యామణి.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో తాజాగా మంచు కుటుంబానికి కోర్టులో ఊరట కల్గింది. ఈ మేరకు విచారణను 8వారాలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది.
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో ప్రాణం బలైపోంది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన. నాయుడుపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేలవలి హరికృష్ణకు భార్య రజిత, కుమార్తె హరిణి ఉన్నారు.