Home / PM Modi
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన ‘స్వచ్ఛత పఖ్వాడా’ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.దీనిలో భాగంగా ఆయన ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో చీపురు పట్టి ఊడ్చారునేటి నుండి, దేశంలోని భారతీయ రైల్వేలు, పోస్టాఫీసులు, టెలికాం, ఐటీ మరియు ఇతర విభాగాలలో పరిశుభ్రత కోసం ప్రచారం ప్రారంభమైంది.
బాలీవుడ్ బాద్ షా, సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దానిలో ఏముంది ప్రత్యేక అనుకుంటున్నారా అందులోనే ట్విట్ట్ ఉందండోయ్...
రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మరి ఆహారం, ఎరువుల కొరత, ఇంధన భద్రత సమస్యల పరిష్కారం ముఖ్యమని, నేటి యుగం యుద్ధ యుగం కాదని ప్రధాని మోదీ రష్యా అద్యక్షుడు పుతిన్ తో అన్నారు. ఉబెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగిన షాంగై సహకార సంస్ధ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు
ఉబ్జెకిస్తాన్లోని సమర్ఖండ్లో రేపటి నుంచి జరగనున్న ఎస్సీఓ సమ్మిట్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయలుదేరి వెళ్లనున్నారు. సమర్ఖండ్లో ప్రధాని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పాటు ఇతర దేశాల నాయకులతో భేటీ అవుతారు.
దేశంలో సర్వత్రా 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు
రానురాను మన దేశంలో చిరుతలు అంతరించిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ ఆలోచన చేశారు. విదేశాల నుంచి చీతాలను తీసుకొచ్చే పనికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే నమీబియా దేశం నుంచి 8 చీతాలను దేశానికి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమయ్యింది.
గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో లిఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఇవాళ రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. గౌరవ వందనం స్వీకరించిన తర్వాత షేక్ హసీనా మాట్లాడారు. భారత్ తమకు మంచి ఫ్రెండ్ అని, ఇండియాకు వచ్చిన ప్రతిసారి సంతోషంగా ఫీలవుతానని, విముక్తి పోరాట సమయంలో ఇండియా ఇచ్చిన సహాకారాన్ని మరిచిపోలేమన్నారు.
భారత నౌకాదళానికి సరికొత్త పతాకం లభించనుంది. బ్రిటిష్ కాలం నాటి గుర్తులతో ఉన్న ప్రస్తుత పతాకాన్ని త్వరలో మార్చనున్నారు. భారత్లోనే పూర్తిగా తయారైన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై ఈ సరికొత్త పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.