Home / Pakistan
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల అరెస్టు చేసారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ను అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) అక్బర్ నాసిర్ ఖాన్ పేర్కొన్నట్లు ఇస్లామాబాద్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
:ప్రస్తుతం పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది. వచ్చే నెల 30వ తేదీ నాటికి 3.7 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు చెల్లించాల్సి ఉందని బ్లూమ్బర్గ్ శుక్రవారం నాడు విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది
ICC ODI Rankings: ప్రపంచ్ కప్ కు ముందు పాకిస్థాన్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో మెుదటి స్థానానికి వెళ్లింది. మంచి ఫామ్ లో ఉన్న ఆ జట్టు న్యూజిలాండ్ పై వరుస విజయాలు సాధించి తొలి స్థానానికి దూసుకెళ్లింది.
ప్రస్తుతం ఆసియాలో ద్రవ్యోల్బణం శరవేగంగా పెరుగుతున్న దేశాల్లో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే శ్రీలంకను కూడా మించిపోయింది. దీనికి ప్రధాన కారణం డాలర మారకంతో స్థానిక కరెన్సీ బలహీనపడ్డంతో పాటు ఆహారం, ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దాని ప్రభావం ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణంపై పడింది.
నెక్రోఫిలియా.. చనిపోయిన వారితో సెక్స్ చేయడంలో లైంగిక ఆనందాన్ని పొందడం.. ఇటువంటి కేసులు పాకిస్తాన్ లో ఇటీవల కాలలో పెరిగిపోయాయి. దీనితో కుటుంబ పెద్దలు చనిపోయిన తమ కుమార్తెల లేదా ఇతర మహిళల సమాధులకు తాళాలు వేయడం ప్రారంభించారు.
ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్ తన రూ. 5,000 నోటును, చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయాలని పాక్ ఆర్థికవేత్త సూచించారు. ఎనర్జీ ఎకనామిస్ట్ అయిన అమ్మర్ ఖాన్ భారతదేశం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దాని పన్ను వసూళ్లు పెరిగాయని అన్నారు.
పాకిస్తాన్లో హృద్రోగులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గుండె జబ్బుల చికిత్సకు కావాల్సిన ముఖ్యమైన హెపారిన్ ఇంజక్షన్కు తీవ్రమైన కొరత ఏర్పడింది. దీనితో అక్కడి రోగులు చికిత్స పొందడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
పాకిస్తాన్లో నిత్యావసర ధరలు చుక్కలనంటాయి. సామాన్యుడికి రెండు పూటల కడుపు నిండడం గగనం మారిపోయింది. పేదల పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ప్రాణం కంటే గోధుమ పిండి ఖరీదైన వ్యవహారంగా మారడం నిజంగానే శోచనీయం.
పాకిస్తాన్ వార్షిక ద్రవ్యోల్బణం రేటు మార్చిలో 35.37 శాతానికి చేరుకుంది, ఇది ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా అత్యధికం. శనివారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, నెలవారీ ద్రవ్యోల్బణం 3.72 శాతంగా ఉండగా, సంవత్సరానికి ద్రవ్యోల్బణం సగటున 27.26 శాతంగా ఉంది.
శుక్రవారం పాకిస్థాన్లోని కరాచీ నగరంలో ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళలు మరియు పిల్లలతో సహా కనీసం 11 మంది మరణించగా పలువురు గాయపడ్డారు