Home / Pakistan
లండన్లో ఉన్న పాకిస్తాన్ సమాచార మంత్రి మరియం ఔరంగజేబ్ ను లండన్ లో పలువురు పిటిఐ మద్దతుదారులు లండన్ వీధుల్లో అడ్డుకుని దొంగ, దొంగ అంటూ నినాదాలు చేసారు.
పాకిస్ధాన్ ముస్లిం లీగ్ అధినేత నవాజ్ షరీష్ ను విభేధిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. పాకిస్థానలో ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీని ఉదహరిస్తూ నవాజ్ ను ఏకిపారేసారు.
భారీ వరదలకు పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగం భూభాగం వరదల్లో మునిగిపోయింది. ఈ వరదల బీభత్సానికి 1,400 మందికి పైగా మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు.
పాకిస్థాన్కు 450 మిలియన్ డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు జో బైడెన్ సర్కార్ ముందుకు వచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్-16 ఫైటర్ జెట్లను అందించనుంది. నాలుగేళ్ల తర్వాత మొదటిసారి ఈ తరహా సహాయానికి అమెరికా ఆమోదం తెలిపింది.
వరదల ధాటికి పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరెంతోమంది నిరాశ్రయులయ్యారు. గత 24 గంటల్లోనే 119 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
భారీ వర్షాలకు పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది. వరదల ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 343 మంది చిన్నారులతో సహా 937 మంది మృతి చెందారు. దాదాపు మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాక్ ప్రభుత్వం గురువారం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
ఆసియా కప్ లో దాయాది పాకిస్థాన్తో ఆదివారం రాత్రి టీమ్ ఇండియా తలపడుతోంది. పాక్ జట్టు టీ20 ప్రపంచకప్ను గెలుపొందిన తర్వాత రెండు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. అయితే ఇండియాతో మ్యాచ్ కు ముందే పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాని స్టార్ ప్లేయర్ ఒకరైన షాహీన్ అఫ్రిది మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్పై టెర్రరిజం చార్జీ ఫైల్ చేయడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది .గత శనివారం నాడు జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన అధికారులను, జడ్జిలను బెదిరించారని, సైన్యాన్ని తిరుగుబాటు చేయాలని రెచ్చగొట్టారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తనను అరెస్టు చేయకుండా ఇస్లామాబాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనను గురువారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
పాకిస్తాన్లో వ్యక్తిగత కక్ష తీర్చుకోవాలంటే చక్కటి ఆయుధం బ్లాస్పేమి లేదా దైవ దూషణ. అల్లాను నిందిచాడని లేదా ఖురాన్ను అగౌరవ పరచాడంటూ నేరం మోపి చంపేసిన ఘటనలు పాక్లో కొకొల్లలు. అలాగే జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య లెక్కేలేదు.
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది దుర్మరణం పాలవ్వగా, ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. ముల్తాన్ - సుక్కూర్ మోటార్వేలో ఆయిల్ టాంకర్ను ప్యాసింజర్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.