Home / latest Telangana news
: పూజారి ప్రియుడి చేతిలో శంషాబాద్లో హత్యకు గురైన అప్సర కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెకి మూడేళ్ళ కిందట చెన్నైకి చెందిన వ్యక్తితో పెళ్ళైందని పోలీసుల విచారణలో తేలింది. కానీ భర్తతో విబేధాల కారణంగా ఏడాది కిందట సరూర్నగర్లోని పుట్టింటికి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ బంజారాహిల్స్ లోని బంజారాభవన్ లో గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రికి బంజారా సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన స్వాగతం పలికారు.
నేడు ( జూన్ 11, 2023 ) తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 10.15 గంటల
శంషాబాద్లో అర్చకుడి చేతిలో దారుణ హత్యకి గురైన అప్సర అసలు ఇంటినుంచి ఎలా వెళ్ళింది.? ఎక్కడెక్కడ తిరిగారు.? ఏం చేశారు.? అర్చకుడు సాయి ఆమెని హత్య చేసేందుకు ఎంతకాలంగా ప్లాన్ చేస్తున్నాడు.? ఏ ఆయుధంతో అప్సరని మట్టుబెట్టాడు.? ఇలాంటి విషయాలన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
నిత్యం పూజలు చేస్తూ భక్తిలో మునిగి తేలే అర్చకుడు ఓ మహిళని చంపేశాడు. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించి వివరాలివి. హైదరాబాద్ సరూర్ నగర్లోని బంగారు మైసమ్మ దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న వెంకట సాయి సూర్య కృష్ణకి ఆలయంలో పరిచయం అయిన అప్సర అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది.
హపీజ్ పేట్ మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు పోగుల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొనగా.. కార్పొరేటర్లు హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, మున్నూరు
దేశంలో కొత్తగా 50 వైద్య కళాశాలలను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా ఇందులో 17 కాలేజీలు ఏపీ, తెలంగాణకు కేటాయించడం గమనార్హం. కాగా ఇందులో తెలంగాణకు 12 మెడికల్ కాలేజీలు.. ఆంధ్రప్రదేశ్ కి ఐదు మెడికల్ కాలేజీలు కేటాయించారు.
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. బత్తిని హరినాథ్గౌడ్ నేతృత్వంలో జరగనున్న ఈ పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ సర్కారు పూర్తి ఏర్పాట్లు చేసింది. కరోనా కారణంగా మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడంతో ఈసారి భారీ స్థాయిలో ప్రజలు హాజరవుతున్నారు.
బీఆర్ఎస్ కి చెందిన బెల్లంపలి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ ఫిర్యాదు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంలో బాధితురాలు రసిన ఫిర్యాదుకు మహిళా కమిషన్ స్పందించింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్పై రేపు సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని ఈ నెల 5న సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్పై కౌంటర్లో సిబిఐ పలు అంశాలు ప్రస్తావించింది.