Home / latest Telangana news
టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్పై హైకోర్టులో విచారణ మూడు వారాలకి వాయిదా పడింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించక పోవడంపై అనుమానాలున్నాయని పిటిషనర్లు కోర్టుకి మొరపెట్టుకున్నారు. ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు వాదనలు వినిపించారు
హైదరాబాద్లోని వైద్య కళాశాలల్లో రెండవ రోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్,మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 10 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. 20 ప్రత్యేక బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఓవైసీ హాస్పిటల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
Telangana Martyrs Memorial: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నేటితో ముగియనున్న సందర్భంగా 22 జూన్ 2023న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 'తెలంగాణ అమరుల స్మారకం –అమర దీపం' ప్రజ్వలన కార్యక్రమం జరుగనుంది.
వివాదాస్పద వ్యాఖ్యలు చేష్టలతో నిత్యం వార్తల్లో ఉండే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్ళీ తెరకెక్కారు. ఎమ్మెల్యే రాజయ్య తనని లైంగికంగా వేధించారని గతంలో సంచలన ఆరోపణలు చేసిన జానకీపురం సర్పంచ్ నవ్య మళ్ళీ మీడియా ముందుకి వచ్చారు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. పార్టీలో చేరికలపై సమాలోచనలు చేశారు. ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైన వేళ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి భేటీ ప్రాధాన్యతని సంతరించుకుంది.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల లోన్కు అప్లై చేసుకునేందుకు బీసీలు తిప్పలు పడుతున్నారు. క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తహశీల్దార్ ఆఫీసులు, మీ సేవా సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
అదిలాబాద్ యం.పి సోయం బాపు రావు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. పార్టీ నేతలతో తన నివాసం లో ఏర్పాటు చేసిన సమావేశంలో తాను ఎంపీ ల్యాడ్స్ నిధులు సొంత అవసరాలకు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.
జనగామ జిల్లా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ సారి కూడా కుమార్తె తుల్జా భవాని రెడ్డి కారణంగా ముత్తిరెడ్డి వివాదంలో ఇరుక్కోవడం విశేషం. నా సంతకాన్ని ఫోర్జరీ చేశావంటూ తుల్జా భవాని రెడ్డి తన తండ్రి, ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డిని నలుగురిలో నిలదీసింది.
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కౌంటర్ ఇచ్చారు. పెద్ద పెద్ద నాయకులమని చెప్పి మీసాలు తిప్పిన వాళ్లు కూడా పరకాలలో పోటీ చేయడానికి భయపడుతున్నారన్న కేటీఆర్ కామెంట్స్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయల వంశానికి చెందిన వాణ్ని.. మీసాలు పెంచి, మెలేయడం తమకు రాజుల కాలం నుంచి వచ్చిందని కొండా మురళి అన్నారు
నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చించారు. ఖమ్మం, నల్గొండ సభలకు ప్రియాంకను కోమటిరెడ్డి ఆహ్వానించారు. అనంతరం సోనియాగాంధీని కలిసి తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చించారు.