Home / latest Telangana news
Telangana Formation Day 2023: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల కోసం రాష్ట్రమంతా ముస్తాబవుతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 2న రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పాటు 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
హైదరాబాద్ శివార్లలోని చందానగర్ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. మామూలుగా అయితే ఈ దర్శనానికి అంత ప్రాముఖ్యత ఉండదు .. కానీ అక్కడ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర బస చేశారు.
చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. తెలంగాణలోని పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేపడతామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కేసులో అరెస్టైన అభ్యర్థులని డిబార్ చేయాలని టిఎస్పిఎస్సి నిర్ణయించింది. భవిష్యత్తులో టిఎస్పిఎస్సి నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని డిసైడైన అధికారులు 37మంది నిందితులకి నోటీసులిచ్చారు
తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో డీ-అడిక్షన్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రత్యేక డి-అడిక్షన్ సెంటర్లు, ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఇవి వ్యక్తులకు ఉచిత మానసిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో ఇవి ఏర్పాటు చేయబడ్డాయి.
న్యూఢిల్లీలో రెజ్లర్ల నిరసన సందర్భంగా కేంద్రం వ్యవహరించిన తీరుపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు.ఈ విధంగా ఎందుకు ఉండాలో భారత ప్రభుత్వం నుండి బాధ్యతాయుతమైన నాయకులెవరైనా మాకు చెప్పగలరా? అని కేటీఆర్ ట్విట్టర్లో కేంద్రాన్ని ప్రశ్నించారు.
తెలంగాణలోని గొల్ల, కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 5 నుండి 2వ విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నల్గొండ జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు.
గర్భిణీ స్త్రీల పోషకాహార స్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రతిష్టాత్మకమైన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ జూన్ 2 నుండి ప్రారంభమయ్యే 21 రోజుల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అంతటా ప్రారంభించబడుతుంది.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ మండలం ఆలూరుకు చెందిన ఆరుగురు గజ్వేల్కు ఆటోలో వెళ్తున్నారు. మార్గం మధ్యలో నార్సింగి మండలం
: ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేయాలనుకుంటున్న కృష్ణుడి రూపంలోని ఎన్టిఆర్ విగ్రహం అంశంలో తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 28న విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పువ్వాడ అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు.