Home / latest Telangana news
తెలంగాణకి చెందిన 152మంది పౌరహక్కులు, విప్లవ సంఘాల బాధ్యులు, మేధావులపై ఉపా చట్టంకింద కేసు నమోదయింది. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీరిలో పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఉన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) గురువారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా నీరు, విద్యుత్, వ్యవసాయోత్పత్తులకు సరైన ధర కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం పిలుపునిచ్చారు.
హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ళు, కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీ లోని శేఖర్ రెడ్డి నివాసం,
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలంటూ కొంతకాలంగా చెప్పులు లేకుండా నడుస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్కి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చిపడింది. మంత్రి సత్యవతి సంకల్ప దీక్షకి భానుడి ప్రతాపం సవాల్గా మారింది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్న వేళ తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో నేటి ఉదయంనుంచి ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో పాగా వేసేందుకు గాను ఏ అవకాశాన్ని వదులుకోరాదని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తనవైపు తిప్పుకోవడానికి గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులపై బీజేపీ దృష్టి సారించింది
యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేశారు. రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతుల చేతులకు బేడీలు, గొలుసులు వేసి కోర్టుకు తీసుకువెళ్లారు. 14 రోజుల రిమాండ్ పూర్తికావడంతో రైతులను నల్గొండ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వస్తున్న వ్యాఖ్యలపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. షర్మిల ఆంధ్రప్రదేశ్కి చెందిన మనిషని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడానికేనని రేవంత్ స్పష్టం చేశారు.
బలిజ సోదర సోదరీమణులు తమ పిల్లల కోసం సంఘం అధ్యర్యంలో నిర్వహించే వివాహ వేదికలను వాడుకోవాలని కాపునాడు అధ్యక్షులు మరియు శ్రీకృష్ణదేవరాయల ఆల్ ఇండియా అధ్యక్షులు నారాయణస్వామి రాయల్ సూచించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. అధ్యక్ష మార్పుపై జరుగుతున్న చర్చ ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. తమ పార్టీలో లీకులకు తావుండదని బండి సంజయ్ అన్నారు.