Home / latest Telangana news
హైదరాబాద్ శివార్లలోని హకీంపేటలో ఉన్న తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపుల ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు
కేసీఆర్, కేటీఆర్, బిఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ కరీంనగర్ ఎంపి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు. మీ నిజ స్వరూపం బయటపడిందని భయపడుతున్నారని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ప్రజలని దోచుకోవడం ద్వారా మీ ఆదాయం ఎలా పెరిగిందో అందరికీ తెలిసిపోయిందని బండి సంజయ్ అన్నారు.
వరంగల్ జిల్లాలో నకిలీ పురుగు మందులు, గడ్డి మందుల తయారీ ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. 13మంది సభ్యుల ముఠాలో నలుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మరికొందరు ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. అరెస్టైన వారినుంచి నాలుగు డిసిఎంల లోడ్ నకిలీ పురుగు మందులు, నకిలీ హాలోగ్రామ్ స్టిక్కర్లు, తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 57 లక్షల రూపాయలుంటుందని వరంగల్ సిపి రంగనాథ్ మీడియాకి చెప్పారు
ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. కాగా ప్రజల సందర్శనార్ధం 12 గంటల వరకు గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. కాగా ఇప్పుడు
ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గద్దర్.. ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. అయితే రెండు రోజుల క్రితం ఆయనకు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో (ఆగస్టు 6) ముగియనున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు చివరివి. మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. చివరి రోజైన ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం చేయనున్నారు. కాగా ఈ తరుణంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
తెలంగాణ శాసన సభలో శనివారం పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ జరిగింది. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా తెలంగాణను అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. కట్టడం మాత్రమే తమకు తెలుసని.. ప్రతిపక్షాలకు కూలగొట్టడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకి సత్వరమే ఆమోదం తెలుపనందుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు ఈ ఉదయం బస్సులు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. రాజ్భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ర్యాలీగా చేరుకున్నారు. జరుగుతున్న పరిణామాలని గమనిస్తున్న గవర్నర్ తమిళి సై ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను వీడియో కాన్పరెన్స్ ద్వారా చర్చలకు ఆహ్వనించారు.
హైదరాబాద్ లో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఓవైపు చారిత్రక చార్మినార్ వెలుగు జిలుగులు… మరోవైపు తళుకులీతున్న ఆకాశహర్మ్యాలు. ఇంకోవైపు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు.. ఆకాశాన్నంటే ఐటీ కంపెనీలు.. విదేశాల తరహాలో స్కైవేలు, హరితహారంతో వెరసీ ప్రపంచమంతా
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్లో బండి ప్రత్యేక పూజలు చేశారు. తనను నమ్మి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ కేంద్రమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.