Home / latest Telangana news
చట్టానికి ప్రతినిధి అయిన ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆ చట్టం చేతులకే దొరికిపోయాడు. నేరగాళ్ళని పట్టుకోవాల్సి ఎస్సై తానే నేరగాడిగా మారాడు. డ్రగ్స్కి కళ్ళెం వేయాల్సిన ఆ ఎస్సై ఆ మత్తు పదార్థాలే అమ్ముకోవాలని ప్లాన్ చేసి సైబరాబాద్ పోలీసులకి చిక్కాడు.
ప్రజలకు, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే ఒక్కోసారి దారి తప్పుతున్న ఘటనలను ఇటీవల ఎక్కువగా గమనించవచ్చు. మద్యం మత్తులో వాహనాలు నడుపరాదని చెప్పే పోలీసులు.. ఈ మధ్య తాగి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. తాజాగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ సీఐ ఫుల్లుగా మద్యం సేవించి హైస్పీడ్లో కారు నడిపి..
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ బిఆర్ఎస్ పాలిటిక్స్ హీటెక్కాయి. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని సిఎం కెసిఆర్ ఖరారు చేశారు. పార్టీ టికెట్ లభించకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆరు నూరైనా ప్రజా జీవితంలోనే ఉంటానని రాజయ్య తాజాగా ప్రకటించారు.
తల్లి మీద ఉన్న ప్రేమతో ఓ కూతురు ఏకంగా చంద్ర మండలంపైనే ఎకరం భూమిని కొనుగోలు చేసింది. చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన తల్లిపై మమకారంతో చంద్రుడిపై స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేయించి, మదర్స్ డే సందర్భంగా తల్లికి గిఫ్ట్ ఇచ్చింది.
తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆలయ ప్రారంభోత్సవంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ కలిసి పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయాన్ని గవర్నర్తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలానే ఈ కార్యక్రమంలో మంత్రులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు పేర్కొంది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డికి మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది.
తెలంగాణ మంత్రి వర్గంలోకి పట్నం మహేందర్ రెడ్డి చేరారు. గవర్నర్ తమిళి సై మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్భవన్లో సిఎం కెసిఆర్ సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. అనంతరం సీఎం కేసీఆర్కు, గవర్నర్కు మంత్రి మహేందర్ రెడ్డి పుష్పగుచ్ఛాలు ఇచ్చారు.
హైదరాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచారం కేసును రాచకొండ పోలీసులు చేధించారు. దీనికి సంబంధించి వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహన్ మీడియాకు వెల్లడించారు.మీర్ పేట్ మైనర్ బాలిక పై హత్యాచారం చేసిన కేసు లో ఆరుగురిని ఆరెస్ట్ చేసామనిమరొక వ్యక్తి పరార్ లో ఉన్నాడని తెలిపారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి నందన వనం లో ఈ సంఘటన జరిగింది..
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కకపోవడంతో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీరు పెట్టారు. అనుచరుల ముందు బోరున విలపించారు. వరంగల్ అంబేద్కర్ విగ్రహం ముందు పడుకుని ఏడ్చారు. వర్షంలో తడుస్తూ కాసేపు మౌనదీక్ష చేపట్టారు.రాజయ్యను చూసి కార్యకర్తలు కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్ గీసిన గీత దాటనని రాజయ్య తెలిపారు.
సామూహిక అత్యాచార బాధితురాలిని సంరక్షించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ మీర్ పేట ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు.