Home / latest Telangana news
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ దిల్లీలో ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షులు ఖరారు చేసారని చెప్పారు. డిసెంబర్ 7న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేస్తున్నారు. పలువురు ఓఎస్డీలు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవులకు గుడ్బై చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఆదివారం సాయంత్రం తన రాజీనామాను గవర్నర్ కు పంపిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ హెటల్ ఎల్లాలో సీఎల్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను హైకమాండ్ కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసారు. రేవంత్ రెడ్డి దీనిపై తీర్మానం ప్రవేశపెట్టగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిని బలపరిచారు
కాంగ్రెస్ చేతిలో పార్టీ పరాజయం పాలైనందుకు తీవ్ర నిరాశకు లోనయినా చింతించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కేటీఆర్ ) అన్నారు. ప్రజాతీర్పును శిరసావహించి సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసారని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేసారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖరారవడంతో ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. సాధారణంగా ఇటువంటి సందర్బాల్లో ముఖ్యమంత్రులు గవర్నర్ ను కలిసి తమ రాజీనామా లేఖను పంపిస్తారు.
తెలంగాణ సాధించిన నేతగా చరిత్రలో తన కంటూ స్దానం సాధించిన కేసీఆర్ రెండు సార్లు ప్రత్యేక తెలంగాణకు సీఎంగా వ్యవహరించారు. తెలంగాణ సెంటిమెంట్ తో 2014లో, సంక్షేమ పధకాల అమలుతో 2018లో అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ కు 2023 ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దీనివెనుక కారణాలేమిటన్న దానిపై ప్రైమ్ 9 ఎనాలిసిస్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దిశగా దూసుకువెడుతోంది. ఈ నేపధ్యంలో టీ కాంగ్రెస్ నేతలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. డ్యాంపై ఇరు రాష్ట్రాల పోలీస్ బలగాలు మోహరించాయి. డ్యామ్ 13వ గేటు వద్ద ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు జేసిబిలను సిద్దం చేశారు. ఇరు రాష్ట్రాల పోలీస్ బలగాలు మోహరింపుతో డ్యామ్ పై ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
తెలంగాణలో 119 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం సాయంత్రం 7 గంటల వరకు 64.14 శాతం పోలింగ్ నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.అత్యధికంగా జనగాంలో 83.34 శాతం, నర్సంపేటలో 83 శాతం, నక్రేకల్లో 82.34 శాతం, భోంగిర్లో 81 శాతం, పాలకుర్తిలో 81 శాతం, జహీరాబాద్లో 79.8 శాతం, నర్సాపూర్ (78.89 శాతం), డోర్నకల్ (79.32 శాతం), వైరా (79.20 శాతం) పోలింగ్ నమోదయింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపధ్యంలో ఇక్కడ ఫలితాలపై పలు సంస్దలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసాయి.అయితే మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని అంచనాలు వెలువరించాయి. వివిధ సంస్దలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి.