Home / latest Telangana news
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఆఫ్ట్రాల్ నువ్వేంత్ రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ప్రజలు ఆశీర్వదించి ఒక అవకాశం ఇస్తే.. నీకు ఆ పదవి వచ్చిందని ధ్వజమెత్తారు. పదవి నీ సొంతం కాదు, నీ జాగీరు కాదు.. అది ప్రజల హక్కు అని విమర్శించారు.
హైదరాబాద్లో ఆరుచోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ సిసిఎస్ ఏసిపి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఉమామహేశ్వరరావుపై ఆరోపణ రావడంతో.. అశోక్ నగర్లోని అతని ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ మహానగరంలో వారాంతాల్లో కుటుంబంతో సహా హోటల్కు వెళ్లి భోజనం చేద్దామనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత నెల రోజుల నుంచి ఫుడ్ సెఫ్టీ అధికారులు నగరంలోని పాపుల్ హోటల్స్పై తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో హోటల్ యజమానులు అస్సలు ప్రమాణాలు పాటించడం లేదని తెలిసింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో కాన్పు కోసం వచ్చిన గర్భిణీకి నర్సులు ఆపరేషన్ చేయడంతో పుట్టిన బిడ్డ అస్వస్దతకు గురై మరణించింది. దీనితో బాధితులు ఆందోళనకు దిగడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన వివరాలివి.
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారీ చేసి నిరుద్యోగ యువతి, యువకులకు అమ్ముతున్న ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మహేశ్వరం SOT, చైతన్య పురి పోలీసుల దాడుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో మొత్తం 7మంది ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 3 నుంచి చినుకులు మొదలయ్యాయి. మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతినగర్, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండి మైసమ్మ , పటాన్ చెరు తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAPCET) 2024 ఫలితాలు శనివారం ప్రకటించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వారిలో 1,80,424 మంది (74.98 శాతం) ప్రవేశానికి అర్హత సాధించారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని కందులవారిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల్లో తగాదాలు రావడంతో కుమారుడు తల్లి అంతక్రియలను ఆపేశారు. పెద్దఖర్మ ఖర్చుపై పంచాయతీ తేలితేనే తలకోరివి పెడతానని కొడుకు పట్టుబట్టడంతో మృతదేహం ఫ్రీజర్లోనే ఉండిపోయింది.
హైదరాబాద్ శివారు కూకట్ పల్లిలో విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ ఎస్ఓటీ, కూకట్ పల్లి పోలీసులు సంయుక్తంగా దాడిచేసి శేషాద్రినగర్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వారివద్ద నుంచి మూడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన ఇంటి స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన సుంకు గీత నుంచి 2003లో ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పిటీషన్ లో పేర్కొన్నారు. తనకు స్థలాన్ని అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందాయంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయని తెలిపారు.