Home / latest Telangana news
హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి కె మాధవి లత పై కేసు నమోదైంది . పోలింగ్ బూత్ వద్ద, బురఖా ధరించిన మహిళల గుర్తింపు పత్రాలను తనిఖీ చేయడం, వారి ముసుగును తీయమని కోరడం పై ఎంఐఎం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన హైదరాబాద్లో అసదుద్దీన్ ఒవైసీపై మాధవిలత తలపడుతున్నారు.
బీజేపీ మాదిరి కాంగ్రెస్కు సర్జికల్ దాడులు చేసే ధైర్యం లేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. శనివారం వికారాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బీజేపీకి ఓటేస్తే.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు.
జూన్ 4న దేశం గెలుస్తుందని, 140 కోట్ల మంది సంకల్పం నెరవేరుతుందని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘కాంగ్రెస్కు ఓటు వేయడమంటే పాత రోజులను ఆహ్వానించినట్లే.. దేశం ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లకూడదని అన్నారు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది . ఓ స్కూల్ లోని స్విమ్మింగ్ పూల్ లో పడి రెండో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మండలంలోని నాగిరెడ్డిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సుజాత స్కూల్ లో ఈ ఘటన జరిగింది .
మోదీ మరలా అధికారంలోకి వస్తే వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశముందని అంటూ రాహుల్ గాంధీ అన్నారు .. .ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల జన జాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండియా కూటమి వస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పారు.
తన చెల్లి షర్మిలను రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబే నడిపిస్తున్నారని ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. షర్మిల తమ పార్టీ సభ్యురాలని తమకు పొరుగున ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆమె అధ్యక్షురాలన్నారు.
హైదరాబాద్ విద్యార్థి మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికాలోని షికాగో వెళ్లాడు. వారం రోజుల నుంచి ఆయన ఆచూకీ తెలియడం లేదు. కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. దీనితో 25 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకంది కోసం షికాగో పోలీసులు, ఇండియన్ కౌన్సేలేట్ కార్యాలయం సిబ్బంది కూడా ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఈ సారి జరిగే ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్ వర్సెస్ ఓట్ ఫర్ డెవలప్మెంట్ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్ చేశారు. భువనగిరి లోక్సభ బీజేపీ ఎంపీ అభ్యర్తి బూరనర్సయ్య గౌడ్కు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు.
లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు లేరని..అంతా కుటుంబ సభ్యుల్లా పనిచేసుకుంటున్నామన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు.
మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో.. ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో.. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.