Home / latest Telangana news
ఉమామహేశ్వరరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఉమా మహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉమా మహేశ్వరరావుకు సంబంధించిన 17 ప్రాపర్టీలను అధికారులు గుర్తించారు. శామీర్ పేటలో ఒక విల్లా, ఘట్ కేసర్లో 5 ప్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 8 గంటలకు విఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
సస్పెండ్ అయిన ఏసిపి ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ సోదాల్లో ట్విస్టు చోటు చేసుకుంది. ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు చేస్తుండగా ఎస్పీ గోనే సందీప్ రావుకు చెందిన డాక్యుమెంట్లు లభించాయి.
తెలంగాణ రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంచార్జ్ వీసీలను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంచార్జ్ వీసీలుగా నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీకి దాన కిషోర్..జేఎన్టీయూకి బుర్రా వెంకటేశం, కాకతీయకు కరుణ వాకాటి, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి రిజ్వి, తెలంగాణ వర్సిటీ సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీకి సురేంద్రమోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీకి జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీకి సీనియర్ ఐఏఎస్ నదీం అహ్మద్ ను ఇంచార్జ్ వీసీగా నియమించింది.
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఆఫ్ట్రాల్ నువ్వేంత్ రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ప్రజలు ఆశీర్వదించి ఒక అవకాశం ఇస్తే.. నీకు ఆ పదవి వచ్చిందని ధ్వజమెత్తారు. పదవి నీ సొంతం కాదు, నీ జాగీరు కాదు.. అది ప్రజల హక్కు అని విమర్శించారు.
హైదరాబాద్లో ఆరుచోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ సిసిఎస్ ఏసిపి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఉమామహేశ్వరరావుపై ఆరోపణ రావడంతో.. అశోక్ నగర్లోని అతని ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ మహానగరంలో వారాంతాల్లో కుటుంబంతో సహా హోటల్కు వెళ్లి భోజనం చేద్దామనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత నెల రోజుల నుంచి ఫుడ్ సెఫ్టీ అధికారులు నగరంలోని పాపుల్ హోటల్స్పై తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో హోటల్ యజమానులు అస్సలు ప్రమాణాలు పాటించడం లేదని తెలిసింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో కాన్పు కోసం వచ్చిన గర్భిణీకి నర్సులు ఆపరేషన్ చేయడంతో పుట్టిన బిడ్డ అస్వస్దతకు గురై మరణించింది. దీనితో బాధితులు ఆందోళనకు దిగడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన వివరాలివి.
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారీ చేసి నిరుద్యోగ యువతి, యువకులకు అమ్ముతున్న ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మహేశ్వరం SOT, చైతన్య పురి పోలీసుల దాడుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో మొత్తం 7మంది ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 3 నుంచి చినుకులు మొదలయ్యాయి. మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతినగర్, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండి మైసమ్మ , పటాన్ చెరు తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.