Home / Latest News
గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పుత్రులు ఇద్దరు కాళభైరవ, శ్రీసింహ మొక్కలు నాటారు.
తెలుగురాష్ట్రాల్లో ఓలా తర్వాత అంత క్రేజ్ ఉబర్ ట్యీక్సీ సర్వీస్ కే ఉందనే చెప్పవచ్చు. కాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్ ట్యాక్సీ సర్వీసెస్ అయిన ఈ ఉబర్ హ్యాకింక్ కు గురైంది. సంస్థకు చెందిన ఓ ఉద్యోగి వర్క్ స్పేస్ మెసేజింగ్ యాప్ లోకి హ్యాకర్లు చొరబడ్డారు. దానితో ఉబర్ డేటా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఉబర్ సంస్థ అఫీసియల్ గా వెల్లడించింది.
ఆసియాకప్ పరాభవం తర్వాత భారత జట్టు మరో టీ20 సిరీస్ కు సిద్దం అయ్యింది. ఆస్ట్రేలియాతో నేటి నుంచి మూడు మ్యాచ్లకు తెర లేవనుంది. మొహాలీ వేదికగా రాత్రి ఏడుగంటలకు తొలి మ్యాచ్ జరుగనుంది.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలు ముగిసాయి. అంతిమయాత్రను అధికారిక లాంఛనాలతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు.
బీహార్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల పిడుగులు పడడంతో పలువురు చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో పిడుగుపాటుకు 11 మంది మృత్యువాతపడ్డారు
తెలుగుదేశం నేతలు ఛలో అసెంబ్లీకి పిలుపు నివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అసెంబ్లీ పరిసరాలలోనూ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోనూ డ్రోనులను తిప్పతూ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అసెంబ్లీకి దారితీసే అన్ని మార్గాల్లోనూ పోలీసుల పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. అయినా కానీ పట్టువిడువని విక్రమార్కుల్లా తెదేపా నేతలు అసెంబ్లీ సమీపంలోని ఓ భవనంపైకి ఎక్కి నిరసన చేపట్టారు.
మెక్సికోలో ఒక్కసారిగా భూమి దద్దరిల్లింది. మెక్సికో సెంట్రల్ పసిఫిక్ తీరంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది.
ఈ మధ్యకాలంలో సాయం చెయ్యడం కూడా తప్పు అయిపోయింది. ఏదో పాపాం కదా అని సహాయం చెయ్యాలని చూసిన వ్యక్తినే దారుణంగా చంపేశాడో వ్యక్తి. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడో కిరాతకుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మళ్లీ కారు మేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
భారతీయులను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 200కి.మీ మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ 12రోజున కూడా ఉత్సాహంగా తన పాదయాత్రను కొనసాగించారు