Home / Latest News
రాజన్నసిరిసిల్ల జిల్లాలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అసౌకర్యాలు వల్ల అక్కడ ఉన్న భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆలయ కోనేరుతో పాటు పరిసర ప్రాంతాల్లో , చెత్త చేదారాల వల్ల భక్తులు రోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి స్వర్గస్తులయ్యారు . మల్లయ్యకు ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉండగా ఈటల రాజేందర్ రెండో కుమారుడు.
బాసర ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంవిద్యార్థి సురేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన నుపుర్ శర్మను అందరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని తాను ఆమెకు మద్దతు ఇస్తున్నానని పేర్కొన్నారు.
ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజీస్టు , మోటివేషనల్ స్పీకర్ , స్టోరీ టెల్లర్, సహజ ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు శైలజ విస్సంశెట్టి గారు ఎంతో మందికి సహాయం చేశారు. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక బడికి పంపించకుండా పిల్లలను ఇంటి దగ్గరే ఉంచిన తల్లితండ్రులు ఇంకా ఉన్నారని ...అలాంటి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలకు చదువుకు మించిన పెద్ద బహుమతి ఏమి ఇవ్వలేమని సహజ ఫౌండేషన్ శైలజ విస్సంశెట్టి గారు పలు సార్లు పలు కార్యక్రమాల్లో ప్రసంగించారు.
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గర్భవతి అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ముంబైలోని డెంటల్ క్లినిక్ బయట కత్రినా మరియు భర్త విక్కీ కౌశల్ కనిపించారు. ఇది రెగ్యులర్ డెంటల్ చెక్-అప్. అయితే, ఆమె ఫోటోలు ప్రెగ్నెంట్ అయిందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
దర్శకుడు సుకుమార్తో గతంలో విజయ్ దేవరకొండ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్ పైకి రాలేకపోయింది.విజయ్ తన ప్రాజెక్ట్స్ లైగర్, కుషి మరియు జన గణ మనతో బిజీగా ఉండగా, సుకుమార్ తన చిత్రం పుష్ప 2 కోసం పని చేస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భారీ రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాంకే బీహారీ ఆలయంలో అర్థరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
లండన్లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బ్రిటిష్ రాజధాని లండన్లో శుక్రవారం నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. అండర్గ్రౌండ్ రైల్వే సర్వీసుతో పాటు ఓవర్ గ్రౌండ్ రైల్వే సర్వీసులు దాదాపు నిలిచిపోయాయి.
మందు తాగండోయ్ బాబు. మందు తాగండోయ్ అంటూ యువతను బతిమాలుకుంటోంది జపాన్ ప్రభుత్వం. సడెన్గా జపాన్ యువత బుద్ది మంతులయ్యారు. మందుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూకు గండిపడింది.