Home / Latest News
తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం ఈ కేసు విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయింది. కాగా అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఈరోజు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఈరోజు మరోసారి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైకి తరలించారు.
ఏ భూకంపం వస్తేనే లేదా నేల కుంగితేనో సడెన్ గా భవనాలు కూలిపోతాయి. అయితే మరి వైయస్ఆర్ జిల్లాలో మాత్రం అకస్మాత్తుగా అర్థరాత్రి వేళ ఓ భవనం కుంగిపోయింది. ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. మరి ఈ ప్రమాదం ఎందుకు ఎలా జరిగిందో ఓసారి చూసేద్దాం..
ఇండియా ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆసీస్ చేతిలో ఒక మ్యాచ్ ఓటమితో ఉన్న ఇండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. అయితే ఈ మ్యాచ్ కూడా గెలిసి 2-0తో సిరీస్ దక్కించుకోవాలని ఆసిస్ చూస్తుంది.
ఇరాన్లోనూ హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా నిరసన సెగలు వెల్లువెత్తాయి. హిజాబ్ ధరించనందుకు మహసా అమిని అనే యువతి ఆ దేశ పోలీసుల దాడిలో గత శనివారం మృతి చెందింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఇరాన్ నిరసనలతో అట్టుడుకుతుంది. అయితే వీటిని అణచివేసేందుకు ఇరాన్ భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అణచివేతలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 31 మంది మరణించినట్లు ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్నఎన్జీనో సంస్థ వెల్లడించింది.
తెలుగు వారు ఏ రంగంలోనై రాణించగలరు ఎన్ని రికార్డులైనా నెలకొల్పగలరు అన్నది నానుడి కాదండో అక్షరాల నిజం. సంపద సృష్టిలో తెలుగువాళ్లు రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ రిచ్లిస్ట్-2022లో మెరుగైన ర్యాంకులన్నీ మన తెలుగువారే సాధించారు.
తక్కువ ధరకే అన్ని ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ కొనుగోలు చెయ్యాలనుకునే వారికి భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా గుడ్ న్యూస్ చెప్పింది. అత్యంత సరమైన ధరకే లావా బ్లేజ్ ప్రోను మార్కెట్లో లాంచ్ చేసింది. మరి దీనికి సంబంధించిన వివరాలేంటో చూసేద్దామా...
నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా పలు బ్రాంచుల్లోని ఖాళీలను భర్తీ చెయ్యనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.
ఓ ఎలక్ట్రానిక్ షోరూంకి కన్నమేసిన రూ. 70 లక్షలకు పైగా విలువైన చరవాణీలను చోరీ చేశాడు.. కానీ అక్కడనున్న ల్యాప్టాప్లు కానీ మరే ఇతర వస్తువుల జోలికి కానీ అతడు వెళ్లకపోవడం గమనార్హం. ఈ ఘటన హైదరాబాద్లోని ఈసీఐఎల్ చౌరస్తాలో జరిగింది.