Published On:

Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి!

Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి!

7 Died in Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలి పైలట్ సహా ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గౌరికుండ్- త్రిజుగి నారాయణ్ మధ్య అటవీ ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ కూలిపోయింది. కాగా ఆర్యన్ ఏవియేషన్ కు సంస్థకు చెందిన హెలికాప్టర్ కేదార్ నాథ్ నుంచి గుప్తకాశీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం.

 

వివరాల ప్రకారం.. ప్రమాదానికి ముందే ఆ హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్ నాథ్ వెళ్లిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్స్ చేసేందుకు సిబ్బంది వెళ్లారు. కానీ దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడికి చేరుకునేందుకు ఆలస్యం కానుందని అధికారులు చెప్పారు. కాగా కొంతకాలంగా ఉత్తరాఖండ్ లో వరుస హెలికాప్టర్ ప్రమాదాలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. మృతులను పైలట్ రాజ్ వీర్, విక్రమ్ రావత్, వినోద్, త్రిష్టిసింగ్, రాజ్ కుమార్, శ్రద్ధ, రాశీ (10) గా గుర్తించారు.

 

కాగా హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ సర్వీసులపై కఠిన ఎస్వోపీ సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. హెలికాప్టర్లను పూర్తిగా తనిఖీ చేయడం తప్పినిసరి చేశారు. సాంకేతిక, భద్రత అంశాల సమీక్ష కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.