Home / latest national news
G20 సదస్సు సందర్బంగా గ్రూప్ సభ్యుల నందరినీ ఉమ్మడి ఏకాభిప్రాయానికి ఒప్పించిన భారతదేశం శక్తిని చూసి ప్రపంచం దాదాపు ఆశ్చర్యపోయింది.షెర్పా అమితాబ్ కాంత్ బృందంలో భాగమైన నలుగురు ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ దౌత్యవేత్తలు నెలల తరబడి కష్టపడి చేసిన పని ఫలితంగా ఈ ప్రకటన వచ్చింది.
బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయానికి చేరుకుని ప్రార్థనలు చేశారు. G20 సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన సునక్, శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తనను తాను హిందువుగా గర్వపడతానని చెప్పారు. దేశ రాజధానిలో ఉన్న సమయంలో ఒక ఆలయాన్ని సందర్శించాలనే తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి శనివారం ఏర్పాటు చేసిన జి20 విందు నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను మినహాయించడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ, ఇండియా కూటమి చెరో మూడు అసెంబ్లీ స్దానాలను గెలుచుకున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘోసి అసెంబ్లీ స్దానంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ది ముందంజలో ఉన్నారు.
ఇండియా పేరును భారత్ గా మార్చుతారన్న వార్తల నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దమ్ముంటే రాజ్యాంగాన్ని మార్చండి అని సవాలు చేశారు. , దేశం పేరు మార్చడానికి రాజ్యాంగాన్ని మారిస్తే ఎవరూ కేంద్రానికి మద్దతు ఇవ్వరని అన్నారు.
2024 లోక్సభ ఎన్నికలకు జనతాదళ్ (సెక్యులర్) మరియు బీజేపీల మధ్య పొత్తు విషయాన్ని జేడీ (ఎస్) వర్గాలు ధృవీకరించాయి. రాష్ట్రంలో పొత్తు పెట్టుకునేందుకు ఇరు పార్టీల అగ్రనేతల మధ్య కీలక భేటీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పెద్దలు పాల్గొన్నారు.
పశ్చిమబెంగాల్ ఎమ్మెల్యేలకు దసరా ఒక నెలరోజులముందే వచ్చినట్లయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం శాసనసభ సభ్యుల జీతాల పెంపును ప్రకటించారు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా ( పీఎఫ్ఐ)కు చెందిన యూనస్ను మూడు నెలల క్రితం ఎన్ఐఏ అధికారారులు అరెస్ట్ చేసిన వసిహాయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా స్థానికంగా నివసిస్తున్న యూనస్ అత్తమ్మ ఇంట్లో ఎన్ఐఏ ఎస్పీ
డిఎంకె ఎంపీ ఎ రాజా గురువారం సనాతన ధర్మాన్ని హెచ్ఐవి మరియు కుష్టు వ్యాధి వంటి వ్యాధులతో పోల్చాలని అన్నారు.సనాతన ధర్మంపై ఉదయనిధి మృదువుగా మాట్లాడారని కూడా ఆయన అన్నారు.
ఆదిత్య ఎల్ వన్ మిషన్ తొలి ఘనతని సాధించింది. ఇప్పటికే నిర్ణీత కక్ష్య దిశగా పయనిస్తున్న ఆదిత్య సెల్ఫీ తీసుకుంది. భూమి, చంద్రుడికి సంబంధించిన ఫొటోలని తీసింది. లాగ్రెంజ్ వన్ పాయింట్ దిశగా వెళుతోంది.