Home / latest national news
పార్టీ జనరల్ కౌన్సిల్ తీర్మానాలు మరియు జనరల్ సెక్రటరీ ఎన్నికలకు వ్యతిరేకంగా ఓ పన్నీర్ సెల్వం (OPS) శిబిరం దాఖలు చేసిన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు తిరస్కరించడంతో ఎడప్పాడి కె పళనిస్వామి (EPS) మంగళవారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు
నమీబియా నుంచి గత ఏడాది కునో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టిన ఎనిమిది చిరుతల్లో ఒకటైన సాషా సోమవారం మరణించింది. ఈ చిరుతకిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. సాషా భారత్కు తీసుకురాకముందే అనారోగ్యంతో బాధపడుతోంది.
ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సోమవారం కోరారు. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి లోక్ సభ హౌసింగ్ కమిటీ సోమవారం నోటీసు జారీ చేసింది.సూరత్ కోర్టు పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో శుక్రవారం ఆయన లోక్సభ సభ్యత్వానికి అనర్హుడయ్యారు
Yediyurappa Home: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇంటిపై దాడి జరిగింది. యడ్యూరప్ప ఇంటి వద్ద భారీ ఎత్తున జనాలు గుమిగూడి, ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు. సోమవారం మధ్యాహ్నం శివమొగ్గలోని ఆయన నివాసం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. మాజీ సీఎం ఇంటి దగ్గర భారీ ఎత్తున జనాలు నిరసన తెలుపుతున్న సన్నివేశాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ నిర్ణయమే కారణమా..(Yediyurappa Home) షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన రిజర్వేషన్లపై ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న […]
సెంట్రల్ కాశ్మీర్లోని గందర్బాల్ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థిని ఇస్లామిక్ పవిత్ర గ్రంథం "ఖురాన్"ను చేతితో రాసింది.సలీమా అనే 22 ఏళ్ల కాలేజీ విద్యార్థిని మొదట పవిత్ర గ్రంథాన్ని కంఠస్థం చేసి, ఆపై చేతితో రాసింది.
బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ భార్య రాజశ్రీ యాదవ్ సోమవారం ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తేజస్వి సోదరి రోహిణి ఆచార్య ట్విట్టర్లో తెలిపారు. తమ ఇంటికి ‘లిటిల్ ఏంజెల్’ రూపంలో కొత్త అతిథి వచ్చిందని చెప్పారు.తేజస్వి యాదవ్ నవజాత శిశువుతో ఉన్న చిత్రాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు.
త్వరలో వందే భారత్ ఎక్స్ప్రెస్ జమ్మూ కాశ్మీర్లో నడుస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.ఉధమ్పూర్-శ్రీనగర్-బారాముల్లా (యుఎస్బిఆర్ఎల్) రైలు లింక్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రైలును నడిపిస్తామని అన్నారు
రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది.న్యాయవాది అశోక్ పాండే దాఖలు చేసిన ఈ పిటిషన్ లో భక్తుల సౌకర్యార్థం సంబంధిత స్థలంలో గోడను నిర్మించాలని కోరారు.
ఉత్తరప్రదేశ్ లో ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆతిక్ అహ్మద్నుఅదుపులోకి తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారం అహ్మదాబాద్లోని సబర్మతి జైలుకు చేరుకున్నారు. సబర్మతి జైలు అధికారులు మరియు యుపి పోలీసు అధికారుల మధ్య అప్పగించే ప్రక్రియ పూర్తయిన తర్వాత అతడిని ప్రయాగ్రాజ్ జైలుకు తీసుకువెళ్లడానికి సిద్దమయ్యారు.
బెంగళూరుకు చెందిన నిష్ణాతులైన అల్ట్రా-మారథాన్ స్విమ్మర్ సుచేతా దేబ్ బర్మన్, పాల్క్ జలసంధి మీదుగా 62 కి.మీ దూరం ప్రయాణించి రెండు వైపులా ఈత కొట్టడం ద్వారా మరో రికార్డును సృష్టించింది.