Home / Kerala
కేరళకు చెందిన 25 ఏళ్ల ఇహ్నా షాజహాన్ కేవలం ఒక్కరోజులో 81 ఆన్లైన్ కోర్సులను పూర్తి చేసి ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. ఒక రోజులో అత్యధిక సంఖ్యలో ఆన్లైన్ సర్టిఫికేట్లను సాధించినందుకు అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కేరళలోని ఆదిశంకరాచార్యుల జన్మస్థలాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. ఎర్నాకులం జిల్లాలోని కాలడి గ్రామంలోని ఆది శంకర జన్మ భూమిని సందర్శించిన చిత్రాలను ప్రధాని అర్థరాత్రి ట్వి ట్టర్ లో పంచుకున్నారు.
విజింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లాటిన్ క్యాథలిక్ చర్చి ప్రతినిధులతో పాటు పలువురు స్థానిక మత్స్యకారులు సోమవారం కేరళలోని తిరువనంతపురంలో నిరసన చేపట్టారు.
క్షీరశ్రీ పోర్టల్ను కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని పాడి రైతులకు ప్రోత్సాహకాల పంపిణీకి క్షీరశ్రీ పోర్టల్ను ఏర్పాటు చేసింది. కేరళలోని పాల ఉత్పత్తిదారులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఈ ప్లాట్ఫారమ్ ప్రారంభించబడింది
కేరళలోని తమ లెఫ్ట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కుట్రలకు పాల్పడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. రాష్ట్ర గవర్నర్ తో పాటు ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుని తమ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుందని అన్నారు.
కేరళలో వరుసగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని దక్షిణ జిల్లాలో వర్షాలు కాస్తా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వాతావరణశాఖ ఈ రోజు ఎనిమిది జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఇదుక్కి, త్రిసూర్, పలక్కాడ్, మల్లాపురం, కోజికోడ్, వానియాడ్,
వర్షాకాలంలో, భారతదేశంలో సందర్శించడానికి అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి కేరళ. ఈ కాలంలో అక్కడి వాతావరణం పచ్చదనం, చల్లని ఉష్ణోగ్రతలతో కూడి ఉంటుంది.కేరళలో రెండు వర్షాకాలాలు ఉన్నాయి, ఒకటి జూన్లో మొదలవుతుంది మరియు రెండవది అక్టోబర్ మధ్యలో మొదలై నవంబర్ మధ్యలో ముగుస్తుంది.
కేరళ కొల్లాం జిల్లాలో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి హాజరయ్యే ముందు తమ ఇన్నర్వేర్లను తొలగించమని బాలికలను కోరిన సంఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీకి చెందిన ముగ్గురు, కాలేజీకి చెందిన ఇద్దరు ఉన్నారు.
కేరళలోని కొల్లాంలో ఆదివారం జరిగిన నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షకు ముందు తన కుమార్తె బ్రాను తొలగించమని ఒత్తిడి చేసారంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. పరీక్షా కేంద్రమైన మార్ థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వద్ద భద్రతా తనిఖీల్లో మెటల్ హుక్స్ బీప్ కావడంతో బాలికను తన బ్రాను తొలగించమని అడిగారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దేశంలో క్రమంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మొదటి కేసు కేరళలో వెలుగు చూడగా.. రెండో కేసు కూడా కేరళలోనే నమోదైంది. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ కేసు వెలుగు చూసినట్లు రాష్ర్ట వైద్యశాఖ ధ్రువీకరించింది. 31 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఈ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిపై దృష్టి