Last Updated:

Kerala Sacrifice Case: కేరళ నరబలిలో షాకింగ్ నిజాలు.. బాధితుల మాంసాన్ని వండుకుని తిన్న నిందితులు

కేరళ నరబలి కేసులో నిందితులైన దంపతులు తమ విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు వెల్లడించారు. భగవల్ సింగ్, అతని భార్య లైలా బాధితులను హత్య చేసిన తర్వాత వారి మాంసాన్ని తినేసినట్లు పోలీసులకు చెప్పారు.

Kerala Sacrifice Case: కేరళ నరబలిలో షాకింగ్ నిజాలు.. బాధితుల మాంసాన్ని వండుకుని తిన్న నిందితులు

Kerala: కేరళ నరబలి కేసులో నిందితులైన దంపతులు తమ విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు వెల్లడించారు. భగవల్ సింగ్, అతని భార్య లైలా బాధితులను హత్య చేసిన తర్వాత వారి మాంసాన్ని తినేసినట్లు పోలీసులకు చెప్పారు. ఈ ఘటన పతనంతిట్ట జిల్లా ఎలంతూర్‌లో చోటు చేసుకుంది. భగవాల్ సింగ్ సీపీఎం మాజీ బ్రాంచ్ కమిటీ కార్యదర్శి మరియు ప్రస్తుతం పాతనంతిట్టలోని ఎలంతూరులో సీపీఎం స్థానిక కమిటీ సభ్యుడు. రెస్లీని 56ముక్కలుగా, పద్మను ఐదు ముక్కలు చేసిభగవత్ సింగ్ దంపతులు, ఏజెంట్ మహ్మద్ షషి తిన్నారు. జూన్ 8న ఒకరిని సెప్టెంబరు 26న మరొకరిని బలిచ్చినట్టు నిందితులు అంగీకరించారు

మంగళవారం దంపతుల ఇంటి ఆవరణలో నరికిన మృతుల శరీర భాగాలను బయటకు తీశారు. వండిన మానవ శరీర భాగాలను తినడం వల్ల యవ్వనాన్ని కాపాడుకోవచ్చని నిందితులైన దంపతులకు ప్రధాన నిందితుడు షఫీ చెప్పినట్లు తెలిసింది. ఈ జంటను కడవంతర పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. ఈరోజు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదిలావుండగా, జూన్ నెలలో ఎర్నాకులంలోని షఫీ (ఇద్దరు మహిళలను దంపతులకు ‘బలి’ కోసం పరిచయం చేసిన ఏజెంట్) హోటల్‌కు వెళ్లిన కేసులో మొదటి బాధితురాలు పద్మం యొక్క సిసిటివి ఫుటేజ్ బయటపడింది.

వీధుల్లో లాటరీ టిక్కెట్లు అమ్ముతూ బ్రతికే పద్మ మరియు రోస్లిన్ అనే ఇద్దరు మహిళలను దంపతులు తమ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి బలి చేశారని పోలీసులు తెలిపారు. మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా, కడవంతర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చివరకు ఇది నరబలిని బయటకు తీసింది. బుధవారం ఎర్నాకులం జిల్లా కోర్టులో నరబలి నిందితులను పోలీసులు ప్రవేశపెట్టగా వారికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.

ఇవి కూడా చదవండి: