Home / Gujarat
గుజరాత్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 182 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది నేరచరితులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ తెలిపింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ మరియు ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బౌలింగ్ తోనే కాకుండా బ్యాట్ తోనూ అద్భుతాలు చెయ్యగల సత్తా ఉన్న ఆల్ రౌండర్ గా జడేజాకు క్రికెట్ చరిత్రలో మంచి పేరుంది. ఐపీఎల్లో చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న జడేజా గతేడాది సీఎస్కేకు సారథ్యం కూడా వహించాడు. జడేజా బరిలోకి దిగి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు లేకపోలేదు. అలాగే ఈ సారి ఈయన భార్య కూడా బరిలో ఉన్నారు. అది క్రికెట్ మైదానంలో కాదండోయ్ గుజరాత్ ఎన్నికల్లో. ఇంతకీ జడేజా భార్య ఎవరు.. ఆమె ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించింది అనే విషయాలు తెలుసుకుందాం.
ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ను ఏడోసారి బీజేపీ కైవశం చేసుకుంది. ఈ విజయం కూడ మామూలుగా లేదు.. ఏకపక్షంగా సాగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు సీరియస్ గా సిద్దంకాకపోవడం, ఆప్ ఆశించిన మేర పట్టణ ఓట్లను సాధించలేకపోవడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది.
గుజరాత్ ఎన్నికల సందర్భంగా పారిపోయిన ఓ ఎమ్మెల్యే ఇప్పుడు అడవుల్లో ప్రత్యక్షమయ్యారు. బీజేపీ దాడితో అదృశ్యమైనట్టుగా చెబుతున్న గుజరాత్లోని దంతా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంతి ఖరాడిని పోలీసులు ఓ అడవిలో గుర్తించి తీసుకొచ్చారు. గుజరాత్ రెండో విడత పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు ఆయన బయటకు వచ్చారు.
ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లో రికార్డు స్థాయిలో రూ.750 కోట్ల విలువైన నగదు, నగలు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటివిడత పోలింగ్ ప్రారంభమైంది . నేడు 89 నియోజకవర్గాల ప్రజలు 788 అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
గుజరాత్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవగా సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మొత్తంగా 788 మంది అభ్యర్థులు బరిలో నిలచున్నారు.
గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో తనపై సామూహిక అత్యాచారంచేసిన 11 మందిని విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వదోదర నగర శివార్లలోని ఒక తయారీ యూనిట్పై దాడి చేసి దాదాపు రూ. 500 కోట్ల విలువైన నిషేధిత ఎండి డ్రగ్ను స్వాధీనం చేసుకుంది.
అహ్మదాబాద్లోని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేసి విధ్వసం సృష్టించారు. సీనియర్ నాయకుడు భరత్సింగ్ సోలంకీ పోస్టర్లను తగులబెట్టారు.