Home / crime news
ఐఐటీ హైదరాబాద్కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన మెగా కపూర్. ఐఐటీలో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గతకొన్ని రోజులుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
తాను ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదని ఆగ్రహంతో ఒక ఉపాధ్యాయురాలు రెండో తరగతి చదువుతున్న బాలికపై తన ప్రతాపం చూపెట్టింది. ఆమె విచక్షణారహితంగా కొట్టిన దెబ్బలకు ఆ చిన్నారి ఆసుపత్రి పాలైంది. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది.
పరాయి స్త్రీల వ్యామోహంతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓ భార్య తన భర్త పై క్షణికావేశంతో కాగుతున్న వేడి నూనెను పోసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
పోలీసులకు సవాల్ విసురుతూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు ఉన్నారు. కానీ చెడ్డీ గ్యాంగ్ రూటే సపరేటు వారి పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల ప్రజలు హడలెత్తిపోతారు. దీనికి కారణం వారు అత్యంత కిరాతంగా ప్రవర్తిస్తూ ప్రజలపై దాడులు చేసి మరీ దొంగతనాలకు పాల్పడడం.
మహిళలపై అఘాయిత్యాలు రానురాను ఎక్కువవుతున్నాయా అంటే అవుననే చెప్పవచ్చు. చిన్నాపెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా ఆడవాళ్లు కనపడితే చాలు వారిపై దాడులు చేస్తున్నారు మృగాళ్లు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో మైనర్ బాలికపై సొంత మేనమామే అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. దానిని ఆ బాలిక ప్రతిఘటించింది.
తెలంగాణలో క్రైం రేటు విపరీతంగా పెరిగిపోయింది. దీనిపై జాతీయ నేర గణాంక సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2021లో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో. తెలంగాణలో క్రైం రేటు భారీగా పెరిగిందని.. మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపులు సైతం గణనీయంగా పెరుగుతున్నాయని ఎన్సీఆర్బీ రిపోర్ట్ తెలిపింది.
హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలోని కుర్మానగర్ లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దివ్య అనే మహిళను భర్త దీపక్ కుమార్ దారుణంగా హతమార్చాడు. గొంతు కోసి కిరాతంగా చంపేశాడు.
క్యాసినో కేసులో . ప్రధాని నిందితుడు చికోటి ప్రవీణ్ సంచలణ కామెంట్స్ చేశారు. తనను చంపేస్తానంటూ విదేశాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పాడు. హిట్ మెన్ అనే యాప్లో సుపారి ఇచ్చామని.. త్వరలోనే నీ ప్రాణాలు పోతాయంటూ కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని చెప్పారు.
అడిస్ అబాబా నుండి ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానంలో చెన్నై వచ్చిన ఒక ప్రయాణీకుడినుంచి రూ.100 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారి అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అధికారులు ఇక్బాల్ బి ఉరందాడి అనేప్రయాణికుడిని అడ్డగించారు.
సికింద్రాబాద్ మారేడుపల్లి ఎస్ఐ వినయ్పై బ్లేడ్తో ఇద్దరు దుండగులు దాడిచేశారు. మారేడ్పల్లి ఓం శాంతి హోటల్ దగ్గర మంగళవారం అర్ధరాత్రి ఘటన చోటుచేసుకుంది. నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఎస్ఐ ఆపే ప్రయత్నం చేశారు. వాహనం ఆపుతుండగా ఎస్ఐపై బ్లేడ్తో దుండగుల దాడికి పాల్పడ్డారు.