Home / cricket news
ఆసియా కప్ 2022 నేడు ఇండియా రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా హాంకాంగ్ పై బుధవారం రాత్రి 07:30 కు తల పడనుంది. మొదటి మ్యాచ్ ఆడిన ఇండియా పాకిస్థాన్ పై గెలిచి పాయింట్స్ టేబుల్లో గ్రూప్ - ఏ లో మొదటి స్థానంలో నిలిచింది.
క్రికెటర్ శుభ్మాన్ గిల్ నటి సారా అలీ ఖాన్తో కలిసి రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది, ఇది ఇద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందన్న పుకార్లకు దారితీసింది.
ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో ఇండియా 5 వికెట్ల తేడాతో , రెండు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ ను ఫినిష్ చేసారు . పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించారు . టాస్ గెలిచినా ఇండియా మొదట ఫీల్డింగును ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 120 బాల్స్ కు 147 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు.
విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో టీ20లో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్రకెక్కాడు. ఓవల్ ఇన్విసిబుల్స్తో జరిగిన మ్యాచ్లో బ్రావో 600వ వికెట్ తీసి, ఈ ఘనతను అందుకున్నాడు.
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టునుంచి బయటకు వచ్చి గోవా జట్టలో చేరాడు. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన అర్జున్ గత ఏడాది జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున రెండు T20లు ఆడాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన అంతర్జాతీయ అంపైరింగ్ దిగ్గజం రూడీ కోర్జెన్ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో రూడీ ప్రాణాలు విడిచారు. రూడీ ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. నెల్సన్ మండేలా బే ఏరియాలో నివసించే రూడీ కోర్జెన్ గోల్ఫ్ టోర్నీలో పాల్గొనేందుకు కేప్ టౌన్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును ప్రకటించారు సెలక్టర్లు. ఆసియా కప్ టోర్నీకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులోకి వచ్చాడు.
భారత క్రికెట్కు, సునీల్ గవాస్కర్కు గర్వకారణమైన విషయం. ఇంగ్లండ్లోని లీసెస్టర్ క్రికెట్ అథారిటీ తమ మైదానానికి గవాస్కర్ పేరు పెట్టనున్నట్లు ప్రకటించింది.ఇది 5 ఎకరాల మైదానం. ఇప్పటికే గవాస్కర్ చిత్రాన్ని స్టేడియం వెలుపల ఉన్న గోడలలో ఒకదానిపై చిత్రీకరించారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ సంస్థ అన్నవిషయం అందరికీ తెలిసిందే. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు నేరుగా కరీబియన్ దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో అఖరి వన్డే ముగిశాక 16 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం ప్రత్యేక విమానంలో మాంచెస్టర్
లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో 100 పరుగుల తేడాతో భారత జట్టుపై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 247 పరుగుల లక్ష్యాన్ని భారత క్రికెట్ జట్టు చేదించలేకపోయింది.247 పరుగుల విజయ లక్ష్యంలో బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు 146 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు వరుసగా ఔట్ అయ్యారు