Home / cm jagan
చంద్రబాబుకు పదవి కావాల్సింది ప్రజలకు మంచి చేయడానికి కాదని.. రాష్ట్రాన్ని దోచుకునేందుకు, పంచుకునేందుకే వారికి అధికారం కావాలని సీఎం జగన్ అన్నారు. పుట్టపర్తిలో రైతు భరోసా, పీఎం కిసాని నిధులు విడుదల చేసిన జగన్ టీడీపీపై విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మరోసారి మండిపడ్డారు. అంగళ్లులో పోలీసులపై దాడులు చేయించారని ఫైర్ అయ్యారు. పుంగనూరులో 40 మంది పోలీసులకు గాయాలయ్యేలా చేశారని.. ఓ కానిస్టేబుల్కి కన్ను కూడా పోయిందని నిప్పులు చెరిగారు.
వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు సాయం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ఈ పథకం లబ్దిదారులకు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు
డిసెంబర్ లోగా విశాఖకు మారతామని ఇక్కడినుంచే పరిపాలన కొనసాగిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం వివాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతానని, పరిపాలనా విభాగం మొత్తం విశాఖకు మారుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభించారు
ఏపీ సీఎం జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ.. ఎన్ఐఏ కోర్టును విశాఖలో కొత్తగా ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో కేసు పరిధి విశాఖకు మారింది. ‘కోడి కత్తి’ కేసు విచారణ విశాఖలో ప్రారంభమైంది. నగరం లోని మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో గల ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఎగరవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు పంట బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఏపీ సీఎం జగన్ మంగళవారం కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలైన గురజాపులంక, కూనాలంక, రామాలయం పేటలోని బాధితులను పరామర్శించారు. గురజాపులంకలోని మెడికల్ కాంపు వద్ద ఆగి పాముకాటుకు గురైన మహిళ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల పట్టాలను అడిగిన మహిళలకు తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు.వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. వరద బాధితులకు నిత్యావసరాలు అందజేశామని అన్నారు. అధికారులు తప్పులు చేస్తే చర్యలు తప్పవని జగన్ హెచ్చరించారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్, లోకేష్, బాలకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు. మంచి చేస్తున్న వ్యవస్థలను కొంతమంది విమర్శిస్తున్నారని మండిపడ్డారు.