Home / bollywood
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు వై ప్లస్ భద్రతను కల్పించారు.
1973 నవంబరు 1 కర్ణాటకలోని మంగళూరులో ఐశ్వర్యారాయ్ జన్మించారు. 1994వ సంవత్సరంలో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 1997లో తమిళ సినిమా ఇరువర్ (ఇద్దరు) తో తెరంగేట్రం చేశారు ఐశ్వర్య. జీన్స్ (1998) సినిమాతో తెలుగు తమిళ హిందీ ఇండస్ట్రీలలో మొదటి హిట్ అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు జ్యూరీ మెంబర్ గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ నటి ఐష్. 20 ఏప్రిల్ 2007న బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితా బచ్చన్ కుమారు అయిన అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకున్నారు.
బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్. ఎన్నోచిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు ఈ అందాల తార. 1980 దశకంలో హిందీపరిశ్రమలో అరంగేట్రం చేసిన ఈ తార చాలా కాలం పాటు అగ్రగామి నటిగా వెలుగొందారు. హం ఆప్కే హై కౌన్ దేవదాస్ రాజా వంటి పలు అద్భుత చిత్రాలెన్నెన్నో నటించి సినీపరిశ్రమలో పలు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులను కైవసం చేసుకున్నారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి సెట్స్ పై తన ఎడమకాలికి గాయమయిందని తన బ్లాగ్ పోస్ట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్పై విచారణ జరుగుతుండగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారత్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టుకు తెలిపింది.
జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసింది. దివంగత నటి అతిలోక సుందరి అయిన శ్రీదేవి, బోనీకపూర్ దంపతుల తనయ జాన్వీకపూర్. మొదటి సినిమాతోనే తనదైన శైలిలో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది. అయితే తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ధోని సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను కైవసం చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. కాగా 2020 జూన్ 14న బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా ఇదే తరహాలో తన ముగ్గురు స్నేహితులు కూడా సూసైడ్ చేసుకోవడం బాలీవుడ్ నాట పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ నటులు డ్రగ్స్ సేవిస్తున్నారని యోగా గురు బాబా రామ్దేవ్ ఆరోపించారు
బాలీవుడ్ లో తీవ్ర విషాదం, ప్రముఖ సీనియర్ హిందీ నటుడు జితేంద్ర శాస్త్రి శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. అయితే, ఆయన మరణానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. జితేంద్ర మరణంపై అతడి తోటి నటులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో వార్త బయటకి వచ్చింది.
దేశంలోని ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ కర్వాచౌత్. కాగా ఈ పర్వదినం సందర్భంగా బాలీవుడ్లో పలు కొత్త జంటలు సందడి చేశాయి. భర్త క్షేమం కోరుతూ మహిళలు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ.