Home / Bihar
బీహార్ అసెంబ్లీ గురువారం రిజర్వేషన్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాను ప్రస్తుతమున్న 50 శాతం నుంచి మొత్తం 75 శాతానికి పెంచే ప్రతిపాదనను బీహార్ కేబినెట్ ఆమోదించింది.
బీహార్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కులాల సర్వే ఆధారంగా ప్రజల సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం మంగళవారం డేటాను విడుదల చేసింది. . డేటా ప్రకారంఅగ్రవర్ణాల్లో భూమిహార్లలో పేదరికం ఎక్కువగా ఉంది. బీహార్లో 27.58 శాతం భూమిహార్లు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని డేటా పేర్కొంది.
బీహార్ ప్రభుత్వం తన వివాదాస్పద కుల ఆధారిత సర్వే వివరాలను సోమవారం వెల్లడించింది. రాష్ట్ర జనాభాలో ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) 63 శాతం ఉన్నారని జనాభా గణన వెల్లడించింది. బీహార్ జాతి అధారిత్ గణన అని కూడా పిలిచే ఈ జనాభా లెక్కల ప్రకారం 13 కోట్ల జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 19 శాతానికి పైగా ఉండగా, షెడ్యూల్డ్ తెగలు 1.68 శాతంగా ఉన్నాయి.
బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా బాగ్మతి నదిలో గురువారం 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.ఇప్పటి వరకు 20 మంది చిన్నారులను రక్షించగా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
బీహార్ లోని బక్సర్లో దక్షిణ భారత వంటకాలను అందిస్తున్న రెస్టారెంట్ దోశతో సాంబార్ను అందించకపోవడంతో వినియోగదారుల కోర్టు ఆగ్రహానికి గురయింది. రూ.140 ధర కలిగిన ‘స్పెషల్ మసాలా దోశ’తో సాంబార్ను అందించనందుకు రెస్టారెంట్కు రూ.3,500 జరిమానా విధించారు.
ఇకనుంచి బీహార్ లో జరిగే ప్రతీ వివాహం పోలీసులకు ముందే తెలుస్తుంది. ప్రజలు తమ కుటుంబంలో జరిగే వివాహాలకు సంబంధించి సమాచారాన్ని స్దానిక పోలీసులకు తెలియజేయాలని లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ సంజయ్ సింగ్ తెలిపారు.
ఓ పాఠశాల మధ్యాహ్నం భోజనంలో ఏకంగా పాము కనిపించింది. అప్పటికే భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బిహార్లోని అరారియాలోని స్థానికి పాఠశాలలో జరిగింది. మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది.
Bihar: విద్యార్ధులకు మంచిబుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. విపరీత చర్యకు దిగారు. వారి ఎదుటే.. చెప్పులతో ఇష్టానుసారంగా దాడి చేసుకున్నారు.
1994లో అప్పటి గోపాల్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ఆనంద్ మోహన్కు మంజూరైన రిమిషన్కు సంబంధించిన అన్ని ఒరిజినల్ పత్రాలను సమర్పించాలని బీహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి గురువారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) ముందు ఉద్యోగాల భూములు కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు.ఈడీ ఉదయం రెండున్నర గంటలపాటు రబ్రీదేవి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆమె మళ్లీ భోజన విరామం తరువాత విచారణకు హాజరయ్యారు.