Home / Bihar
బీహార్లోని అరారియా జిల్లాలో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి రెండ్రోజుల ముందే కూలిపోయింది. బ్రిడ్జ్ కూలిపోవడం యొక్క షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వంతెన మొదట పూర్తిగా నీటిలో మునిగిపోయే ముందు పాక్షికంగా కూలిపోయింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్గాంధీకి బిహార్ ఎన్నికల ర్యాలీలో చేదు అనుభవం ఎదురైంది. బిహార్లోని పాలీగంజ్లో సోమవారం ఇండియా కూటమి ర్యాలీలో స్టేజ్లో కొంత భాగం కూలింది. కాగా స్టేజీపై రాహుల్గాంధీతో పాటు రాష్ర్టీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ ఉన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. శనివారం ఆయన పాటలిపుత్రలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియా కూటమిపై తన దైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓట్లు దండుకోవడానికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ముజ్రా చేయడానికి కూడా కూటమి సిద్దంగా ఉందని ఎద్దేవా చేశారు.
అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత భారతీయ జనతాపార్టీ సీతమ్మకు దేవాలయం కట్టి ఓట్లు దండుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం లోకసభ ఎన్నికల సీజన్ కొనసాగుతోంది. ఐదవ విడత ప్రచారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిహార్లో పర్యటిస్తున్నారు.
బిహార్ రాజధాని పాట్నాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పాట్నా రైల్వే స్టేషన్కు సమీపంలో గురువారం హోట్లో లోపల అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. వారిలో ముగ్గురు మహిళలున్నట్లు పాట్నా పోలీసులు తెలిపారు. పాట్నా జంక్షన్ సమీపంలో ఉన్న ఈ హోటల్లో సహాయక చర్యలు చేపట్టామని సిటి సెంట్రల్ ఎస్పీ చంద్రప్రకాశ్ చెప్పారు.
బీహార్లో మహాఘట్బంధన్ అధ్యాయం ఇక ముగిసినట్లే అని చెప్పుకోవచ్చు.తన రాజకీయ మనుగడ కోసం ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటే బీజేపీతో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం నితీష్ బీజేపీని వీడి ఆర్జెడీ - కాంగ్రెస్తో జట్టు కట్టి మహాఘట్బంధన్గా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎం కుర్చీలో కూర్చున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్కు చెందిన జనతాదళ్ (యు)కు లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్కు మధ్య బేధాభిప్రాయాలు గురువారం తారాస్తాయికి చేరాయని పాట్నాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు తలెత్తున్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్న నితీష్ కూటమికి హ్యాండ్ ఇచ్చి .. రాబోయే లోకసభలో ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వనున్నట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ప్రకటించింది. కర్పూరీ ఠాకూర్ వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తిగా పేరు పొందారు.జనవరి 24న కర్పూరి ఠాకూర్ 100వ జయంతి సందర్భంగా కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రదానం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
బీహార్లోని మోతీహరి వీధుల్లో ఒక విమానం వంతెన కింద ఇరుక్కుపోయి ట్రాఫిక్కు పెద్ద అంతరాయం కలిగించింది.పాత విమానాన్ని ముంబై నుంచి అసోంకు ట్రైలర్ ట్రక్కుపై తరలిస్తుండగా, పిప్రకోఠి ప్రాంతంలోని ఓవర్బ్రిడ్జి కింద చిక్కుకోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
బీహార్లోని నలంద జిల్లా పావపురిలోని వర్ధమాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని నలుగురు వైద్యులు మరియు ఒక క్లర్క్పై పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరు వైవా పరీక్షలలో మెరుగైన గ్రేడ్ల కోసం కనీసం ముగ్గురు విద్యార్దినుల నుండి లైంగిక ప్రయోజనాలను డిమాండ్ చేశారు. దీనిపై విచారణకు నలంద జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.