Home / Andhra Pradesh
14 days Remand for Kakani: మాజీ మంత్రి కాకాణికి 14 రోజులు రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్న కాకాణి ఉన్నారు. కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. అయితే రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాణిని.. నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కాకాణిని పోలీసులు విచారించారు. ఇప్పటికే ఈ […]
Pawan Kalyan attends 1 Nation 1 Election seminar in Chennai: దేశంలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధానం వల్ల లాభమే జరుగుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చెన్నైలోని తిరువాన్మియూర్ లో జరిగిన వన్ నేషన్- వన్ ఎలక్షన్ అనే సెమినార్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సెమినార్ లో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తిరువల్లువర్, భారతియార్, ఎంజీఆర్ జీవించిన నేల తమిళనాడు అని.. తమిళనాడు సిద్ధుల భూమి అన్నారు. […]
3 People died in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కంచిలి మండలం పలపంపర గ్రామంలో గ్రామదేవత ఉత్సవాల్లో కరెంట్ షాక్ వల్ల ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. గ్రామదేవతల ఉత్సవాల్లో లైటింగ్ డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైర్లు తెగి కిందపడటంతో ఘటన జరిగింది. తీవ్రగాయాలైన మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా జాతరలో విద్యుదాఘాతంతో ముగ్గురు చనిపోవడంపై మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి […]
Rains alert to Andhra Pradesh and Telangana: దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ, కర్నాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించగా.. నేడు రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. అయితే ఓ వైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం, బంగాళాఖాతంలోని అల్పపీడనం నైరుతి రుతుపవనాల కదలికలకు అనుకూలంగా మారింది. కాగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదిలి మరో రెండు రోజుల్లో ఏపీ అంతటా విస్తరించనున్నాయి. మరోవైపు రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. అలాగే […]
TDP Mahanadu in Kadapa: రేపటి నుంచి జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి కడప నగరం ముస్తాబైంది. పార్టీ చరిత్రలోనే తొలిసారిగా వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి మూడు రోజులపాటు మహానాడు నిర్వహించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మహానాడు సభా ప్రాంగణానికి కన్వీనర్ గా ఉన్న నిమ్మల.. వర్షం కారణంగా సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు. పార చేతపట్టి […]
Vallabhaneni Vamsi Falls Sick: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా కొంత కాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం వంశీ అస్వస్థతకు గురవడంతో కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనను కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. […]
4 Killed in Accident Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మరొకరికి తీవ్రగాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. కాగా స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని […]
Pawan Kalyan Chennai Tour: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు చెన్నైలో పర్యటిస్తున్నారు. ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ అంశంపై జరగే సెమినార్ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తిరువాన్మియూరు రామచంద్ర కన్వెన్షన్ హాలులో సదస్సు జరగనుంది. తెలంగాణ మాజీ గవర్నర్, వన్ నేషన్- వన్ ఎలక్షన్ తమిళనాడు రాష్ట్ర కన్వీనర్ తమిళిసై సౌందర రాజన్ నేతృత్వంలో సెమినార్ నిర్వహిస్తున్నారు. కాగా ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నిన్న […]
AP Ex Minister Kakani Arrested in Illegal Mining Case: ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి భారీ షాక్ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పెలుడు పదార్థాల వినియోగం వంటి అంశాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో కాకాణిని ఏ-4 గా చేర్చుతూ.. కేరళలో ఆయనను […]
Heavy Rains Expected to Andhra Pradesh for Next 3 Days: ఏపీకి వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అలాగే పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా అల్పపీడన […]