Home / Andhra Pradesh
Vallabhaneni Vamsi Falls Sick: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా కొంత కాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం వంశీ అస్వస్థతకు గురవడంతో కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనను కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. […]
4 Killed in Accident Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మరొకరికి తీవ్రగాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. కాగా స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని […]
Pawan Kalyan Chennai Tour: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు చెన్నైలో పర్యటిస్తున్నారు. ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ అంశంపై జరగే సెమినార్ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తిరువాన్మియూరు రామచంద్ర కన్వెన్షన్ హాలులో సదస్సు జరగనుంది. తెలంగాణ మాజీ గవర్నర్, వన్ నేషన్- వన్ ఎలక్షన్ తమిళనాడు రాష్ట్ర కన్వీనర్ తమిళిసై సౌందర రాజన్ నేతృత్వంలో సెమినార్ నిర్వహిస్తున్నారు. కాగా ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నిన్న […]
AP Ex Minister Kakani Arrested in Illegal Mining Case: ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి భారీ షాక్ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పెలుడు పదార్థాల వినియోగం వంటి అంశాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో కాకాణిని ఏ-4 గా చేర్చుతూ.. కేరళలో ఆయనను […]
Heavy Rains Expected to Andhra Pradesh for Next 3 Days: ఏపీకి వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అలాగే పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా అల్పపీడన […]
Ap Deputy CM Pawan Kalyan Serious on Telugu Movie Industry: తెలుగు చిత్ర పరిశ్రమకు కూటమి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా.. సినీ […]
Bomb Threat to Vijayawada Railway Station: విజయవాడకు వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవాళ ఉదయం బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ రావడంతో స్థానికంగా ఉన్న షాపులు మూసివేయించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేశారు. చివరికి బాంబు లేదని నిర్ధారించుకుని షాపులు తెరిచేందుకు అనుమతినిచ్చారు. అనంతరం విజయవాడ రైల్వేస్టేషన్ లోనూ బాంబ్ పెట్టినట్టు రావడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. గుర్తు తెలియని […]
NO Shutdown Theatres in Telugu States: తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల బంద్ ఉండబోదని స్పష్టమైంది. ఈ మేరకు సినీ నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని సినీ వర్గాలు ప్రకటించినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. పరిశ్రమలోని సమస్యలను సమగ్రంగా చర్చించి, పరిష్కరించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. మే 30 నుంచి […]
Monsoon Waves Enters into Kerala: దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళను తాకాయి. ప్రతి ఏటా జూన్ 1 తర్వాత వచ్చే రుతుపవనాలు ఈసారి ఎనిమిది రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించినట్టుగా భారత వాతావరణశాఖ తెలిపింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు ఇంత త్వరగా రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. రుతుపవనాల రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు రెడీ […]
5 Killed in Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో కారును లారీ ఢీకొంది. ఘాట్ రోడ్డులోని మూల మలుపు వద్ద వేగంగా వచ్చిన లారీ కారుపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నారు. వీరంతా రాయచోటి నుంచి కడపకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియలేదు. సమాచారం అందుకున్న […]