Home / పొలిటికల్ వార్తలు
తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్షా పర్యటన ఖరారైంది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడులో జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్చుగ్ తెలిపారు.
గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో నిందితులను విడుదల చేయడంపం మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇంతటి దారుణానికి పాల్పడిని వాళ్లకు విడుదల చేయడం సరికాదన్నారు. ప్రధాని మోదీకి దేశం మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ విషయంలో కలుగజేసుకోవాలన్నారు. గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కులం, మతం పేరుతో దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో పర్యటించిన సీఎం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంతాయిపల్లి పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డును, కేంద్ర ఎన్నికల కమిటి ప్రకటించింది. పార్లమెంట్ బోర్డులో కొత్తగా 11 మందికి చోటు కల్పించగా.. కేంద్ర ఎన్నికల కమిటిలో 15 మందికి అవకాశం కల్పించారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ జమ్మూ మరియు కాశ్మీర్ కమిటీ ఛైర్మన్ పదవి నుండి వైదొలిగారు. తనకు ఈ పదవికి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆజాద్ చెప్పినప్పటికీ,
ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఇ పళనిస్వామికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని పునరుద్ధరిస్తూ ఆయన బద్ధ ప్రత్యర్థి పన్నీర్ సెల్వంకు అనుకూలంగా మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది.
ఏపీకి జగన్ సీఎం అయిన దగ్గరి నుంచి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే తరలిపోయినవే ఎక్కువ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ ఎద్దేవా చేశారు. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంతా అనే చర్చే జరుగుతోందని విమర్శించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని పవన్ మండిపడ్డారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ పాదయాత్రలో టిఆర్ఎస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు. బండి సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో టిఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యోగాలపై బండి సంజయ్ ను ప్రశ్నించారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. తాను చేసిన హోంగార్డ్ ప్రస్తావనపైనా రేవంత్ రెడ్డి క్షమామణ చెప్పారు. అద్ధంకి చేసిన వ్యాఖ్యలను బాధ్యత వహిస్తూ తాను సారీ చెబుతున్నానని చెప్పారు.