Home / పొలిటికల్ వార్తలు
మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు.ఈ మేరకు బుధవారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాపోలు ఆనంద్ భాస్కర్ రాజీనామా లేఖ పంపారు.
అధికార పార్టీ వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో వైసిపి కార్యకర్తలు మనోవేదనలకు గురౌతున్నారని దర్శి వైకాపా శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వైకాపా ప్లీనరీలో మాట్లాడిన అంశాలు నేడు నెట్టింట ట్రోల్ అవుతున్నాయి.
ప్రజా శాంతి పార్టీ నాయకుడు కేఏ.పాల్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ సవాలు విసిరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చావో చెప్పాకే మునుగోడుకు రండి. నేను మునుగోడు లోనే ఉన్నా, దమ్ముంటే మునుగోడులో బహిరంగ చర్చకి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా కేసీఆర్ అంటూ కేఏపాల్ సవాలు విసిరారు.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూళ్లూరుపేట పురపాలక సంఘ పరిధిలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు.
పంపుడు స్టోరేజి ప్లాంట్స్ (పిఎస్పీ) స్కీం కింద కడపకు చెందిన సీఎం జగన్ బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కు వందల ఎకరాల భూమి ధారదత్తం చేశారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ రుజువులతో మీడియాకు చూపించారు.
న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే బుధవారం అధికారికంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది నవంబర్ 11న ఏపీలోని విశాఖపట్టణంలో పర్యటిస్తారు.
ఏపీలో అన్న జగన్ మోహన్రెడ్డి అధికార సాధనకు భారీగా ప్రచారం చేసి, గెలిచాక విభేదించి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు షర్మిల.
దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ రాశారు. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడని, రోజ్ గార్ మేళాతో తెలిసివచ్చిందన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావిస్తున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లకుండా దూరంగా ఉంటున్న ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది.