Home / పొలిటికల్ వార్తలు
అధికార బలం, తాయిలాలు, హామీలు మాటున మునుగోడు ఉప ఎన్నికల్లో పలు పార్టీలు పోటా పోటీలు పడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు, ములుగు శాసనసభ్యురాలు ధనసారి అనసూయ (సీతక్క) మాత్రం తనదైన శైలిలో ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని చెప్పుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చిన ఏపీ మహిళా కమీషన్ కు పలు పార్టీల నేతల నుండి నిరసనలు గుప్పుమంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు నోటీసులు పంపించారు సరే, వైకాపా నేతల పట్ల మహిళా కమీషన్ ప్రవర్తిస్తున్న తీరును తెదేపా నేత వర్ల రామయ్య సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు.
అవినీతికి కేరాఫ్ అడ్రసుగా నిలిచారంటూ సీఎం కేసిఆర్ పై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్ష్యురాలు వైఎస్ షర్మిల మరో మారు ఆయన పాలనపై మండిపడ్డారు. 8ఏళ్లుగా కేసిఆర్ ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిందని విమర్శించారు.
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు దండుపాళ్యం ముఠాలెక్క ఇక్కడే పాగా వేసిండ్రు అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు ధ్వంసమయ్యాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కులవృత్తులను బలోపేతం చేస్తూ వస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలోని 13మంది వైసీపీ ప్రజా ప్రతినిధులపై జనసేన పార్టీ శ్రేణులు దాడులు చేసే అవకాశం ఉందంటూ పోలీసు ఇంటిలిజెన్స్ నివేదికపై అధికార పార్టీ కుట్రలు తిప్పి కొట్టాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ అప్రమత్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డి పేటలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. యాది మరిచిండ్రా సార్.. డిగ్రీ కళాశాల ఇప్పిస్తా అన్నారు అంటూ ప్లెక్సీలపై రాతులు ఉన్నాయి. విద్యార్థుల ద్రోహి కేటీఆర్ మాకొద్ది ఈ పాలన అంటూ అందులో రాసి ఉంది.
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కన్జర్వేటివ్ పార్టీలో వాతావరణం వేడెక్కింది. ఆ పార్టీకి చెందిన 100 ఎంపీల మద్ధతు తనకు ఉందంటూ భారత మూలాలకు చెందిన రుషి సునాక్ వెల్లడించారు.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ లను, వార్డు మెంబర్లను సంతలో పశువులను కొనుగోలు చేసిన్నట్లుగా అధికార పార్టీ తెరాస ప్రజాప్రతినిధులను కొంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాతిపల్లి, ఊకొండి గ్రామంలో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచారంలో ఆయన సీఎం కేసిఆర్ పాలనపై ధ్వజమెత్తారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదివారంనాడు షోకాజ్ నోటీసులు పంపింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది.