Home / పొలిటికల్ వార్తలు
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు సీఎంలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రస్తుతం పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, గవర్నర్లకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికలు రాజకీయ పార్టీల్లో అలజడి రేపుతుంది. ప్రధానంగా నగదు పంపిణీ, లోపాయికారి హామీలు, విచ్చల విడి మద్యం పంపిణీ అంశాలు మునుగోడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. అధికార దాహంతో ఒకరైతే, అధికారం కోసం మరొకరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
యునైటెడ్ కింగ్డమ్లో రిషి సునక్ అత్యున్నత ప్రధాన మంత్రి పదవి చేపట్టడంపై భారత్ లో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కోవర్ట్ ఆపరేషన్ పనికిమాలిన చర్యగా ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసారి అనసూయ (సీతక్క) సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ప్రజలను పలకరిస్తున్న సీతక్క వెంకటరెడ్డి చర్యలను బహిరంగంగానే దుయ్యబట్టారు.
ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైకాపా పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ దెందలూరు నాయకురాలు గంటసాల వెంకటలక్ష్మీ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన ఆమె వాసిరెడ్డి పద్మపై విరుచుకపడ్డారు.
దీపావళిని ఏపి సీఎంతో పోలుస్తూ రాక్షస జాతిని గుర్తు చేశారు కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి. మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. లాండ్, శాండ్ మైనింగ్ మాఫియాలు రాష్ట్రంలో ఎక్కువైనాయన్నారు. అనుకూల వాతావరణ పరిస్ధితి నేడు రాష్ట్రంలో లేదన్నారు.
దీపావళి పండుగ గదా...మన పార్టీ ప్రజా ప్రతినిధులకు ఓ గిఫ్ట్ ఇవ్వాలని భావించాడు ఆ మంత్రి...ఇంకేముంది అమల్లో పెట్టేశాడు..చివరకి సోషల్ మీడియాలో చిక్కుకొని గిల గిల కొట్టుకున్న ఆ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకొనింది. అది కాస్తా వివాదానికి దారితీసింది.
మునుగోడు ఉపఎన్నికలు రోజురోజుకు కాక పుట్టిస్తున్నాయి. బైపోల్స్ దగ్గర పడుతున్న వేళ నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ఇంటిఇంటికి తిరుగుతూ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు.
మహారాష్ట్ర శివసేన పార్టీలో ముసలం పెట్టిన భాజపా, అసమ్మతి వర్గానికి మద్దుతు ఇచ్చి ఏక్ నాధ్ షిండేకు అధికార పీఠం కట్టబెట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఉద్దవ్ శివసేన పార్టీకి చెందిన సామ్నా పత్రిక ఓ సంచలన రాజకీయ కధనాన్ని ప్రచురించింది.
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు నియోజరవర్గంలో జరిగే ఉప ఎన్నికల కోసం అధికార ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలే కాకుండా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు కోమటిరెడ్డిపై చెప్పుతో దాడికి ప్రయత్నించారు.