Published On:

Pakistan: పాక్ రేంజర్ ను పట్టుకున్న బీఎస్ఎఫ్!

Pakistan: పాక్ రేంజర్ ను పట్టుకున్న బీఎస్ఎఫ్!

Pakistan:  భారత్ లోకి చొరబడ్డ పాకిస్థాన్ రేంజర్ ను BSF అదుపులోకి తీసుకుంది. రాజస్థాన్ లోని భారత్-పాక్ సరిహద్దులో ఓ పాకిస్థానీ రేంజర్ కదలికలను గమనించిన BSF అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం ప్రకటించింది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ పాక్ రేంజర్ క్వాజా మీర్ పట్టుబడటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.

 

భారత్‌పై పాక్ కోవర్ట్ ఆపరేషన్‌కు సిద్ధమైనట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఇండియా యుద్ధ సన్నద్ధతపై పాక్‌లో టెన్షన్ మొదలైంది. దీంతో ఇండియా వ్యూహాలను తెలుసుకునేందుకు కోవర్ట్ ఆపరేషన్‌‌కు పాక్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఫోర్డ్ అబ్బాస్ వద్ద పాక్ రేంజర్లను సరిహద్దులు దాటించే ప్రయత్నం చేస్తుంది.

 

పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇండియాతో యుద్ధం కోరుకుంటుండగా… పాక్ సైన్యాన్ని బలూచ్ ఆర్మీ, తాలిబాన్లు ఊచకోత కోస్తున్నారు. బెలూచిస్తాన్, ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో సొంత సైనికులను మునీర్ కాపాడుకోలేకపోతున్నారు. దీంతో అసీం మునీర్ రాజీనామా చేయాలంటూ పాకిస్తాన్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. పదవిని కాపాడుకునేందుకు ఇండియాపై యుద్ధం చేయాలని మునీర్ కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది.

 

యుద్ధం పేరుతో పాకిస్తానీయుల భావోద్వేగాలతో ఆర్మీ చీఫ్ ఆడుకుంటున్నారని యుద్ధనిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలనే మునీర్ చూసుకుంటున్నాట్లుగా తెలుస్తోంది. ఆయనపై రోజురోజుకు తిరుగుబాటు పెరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాడంటూ పాకిస్తాన్‌లో హోర్డింగ్‌లు కనిపిస్తున్నాయి.

 

21వ శతాబ్దంలో కూడా యుద్ధాలు చేయడం మూర్ఖత్వం అంటున్నారు పాకిస్తాన్‌కు యువకులు. యుద్ధం వద్ద ఉపాధి కల్పించండ అంటూ పాక్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ కు విన్నవిస్తున్నారు. దేశంలో ఒక వైపు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ, రాజకీయ అస్థిరత ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇండియాతో ఏ ముఖం పెట్టుకొని యుద్ధానికి పోతారంటూ విమర్శిస్తు్న్నారు.