Last Updated:

Narco Terror case: నార్కో-టెర్రర్ కేసు.. 6 రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు

నిషేధిత వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) సభ్యుడు జస్వీందర్ సింగ్ ముల్తానీ సహచరుల ప్రాంగణాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

Narco Terror case: నార్కో-టెర్రర్ కేసు.. 6 రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు

Narco Terror case: నిషేధిత వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) సభ్యుడు జస్వీందర్ సింగ్ ముల్తానీ సహచరుల ప్రాంగణాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

జస్వీందర్ సింగ్ ముల్తానీ అనుచరులు..( Narco Terror case)

గత ఏడాది చండీగఢ్‌లోని మోడల్ బురైల్ జైలు సమీపంలో బాంబును అమర్చిన ఘటనలో జస్వీందర్ సింగ్ ముల్తానీ పాల్గొన్నాడు. లూథియానా కోర్టు పేలుడు సూత్రధారిగా 2021లో జర్మనీలో అరెస్టయ్యాడు.ఉగ్రవాదం-మాదక ద్రవ్యాలు-స్మగ్లర్లు-గ్యాంగ్‌స్టర్ల అనుబంధంపై నమోదైన ఐదు కేసులకు ప్రతిస్పందనగా ఎన్ఐఏ బృందాలు ఢిల్లీ-ఎన్ సి ఆర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల్లో దాడులు నిర్వహించాయి. ఎన్ఐఏ వర్గాల సమాచారం ప్రకారం, విదేశాల్లోని గ్యాంగ్‌స్టర్లు ఖలిస్తానీ వేర్పాటువాదులకు నిధులు సమకూర్చడం ద్వారా భయాందోళనలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దాడుల్లో పాల్గొన్న 200 మంది సభ్యులు..

NIAకి చెందిన 200 మందికి పైగా రెడ్ టీమ్ సభ్యులు 100 చోట్ల దాడుల్లో పాల్గొన్నారని వర్గాలు తెలిపాయి.జస్విందర్ సింగ్ ముల్తానీ ఎస్ఎఫ్ జె వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూకు సన్నిహితుడు. అతను వేర్పాటువాద కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాడని నమ్ముతారు.జస్వీందర్ సింగ్ ముల్తానీ 2020-2021లో రైతుల నిరసన సందర్భంగా సింగు సరిహద్దులో రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్‌ను చంపడానికి కుట్ర పన్నారని ఆరోపణలు ఉన్నాయి.

పంజాబ్‌లో వేర్పాటువాద ఎజెండా మరియు హింసాత్మక మిలిటెన్సీని ప్రోత్సహించినందుకు 2019లో కేంద్రం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద ఎస్ఎఫ్ జె ని నిషేధించింది. వివిధ వర్గాల మధ్య చీలికను సృష్టించడం మరియు రాష్ట్రంలో శాంతి మరియు మత సామరస్యానికి భంగం కలిగిస్తుందన్న ఆరోపణలపై కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.