Last Updated:

Manipur Theatres: మణిపూర్ ధియేటర్లలో రెండు దశాబ్దాల తరువాత మొదటిసారిగా హిందీ చిత్రం ప్రదర్శన..

జాతి ఘర్షణలు జరుగుతున్న మణిపూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఒక హిందీ చిత్రం ప్రదర్శించబడుతోంది.గిరిజన సంస్థ హ్మార్ స్టూడెంట్స్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఏ) మంగళవారం సాయంత్రం చురచంద్‌పూర్ జిల్లాలోని రెంగ్‌కాయ్ (లంకా)లో హిందీ చిత్రాన్ని ప్రదర్శించాలని ప్లాన్ చేసింది. అయితే ఆ సినిమా పేరును మాత్రం వెల్లడించలేదు.

Manipur Theatres: మణిపూర్ ధియేటర్లలో  రెండు దశాబ్దాల తరువాత మొదటిసారిగా హిందీ చిత్రం ప్రదర్శన..

 Manipur Theatres: జాతి ఘర్షణలు జరుగుతున్న మణిపూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఒక హిందీ చిత్రం ప్రదర్శించబడుతోంది.గిరిజన సంస్థ హ్మార్ స్టూడెంట్స్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఏ) మంగళవారం సాయంత్రం చురచంద్‌పూర్ జిల్లాలోని రెంగ్‌కాయ్ (లంకా)లో హిందీ చిత్రాన్ని ప్రదర్శించాలని ప్లాన్ చేసింది. అయితే ఆ సినిమా పేరును మాత్రం వెల్లడించలేదు.

సోమవారం హెచ్‌ఎస్‌ఏ ఒక ప్రకటనలో దశాబ్దాలుగా ఆదివాసీలను లొంగదీసుకున్న తీవ్రవాద గ్రూపులకు మా ధిక్కారాన్ని మరియు వ్యతిరేకతను తెలియజేస్తున్నాము. స్వేచ్ఛ మరియు న్యాయం కోసం మా పోరాటాన్ని కొనసాగించడానికి ప్రతిజ్ఞ చేయడంలో మాతో చేరండి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన దేశ వ్యతిరేక ఉగ్రవాద గ్రూపుల నుండి మేము మా స్వేచ్ఛను ప్రకటిస్తామని తెలిపింది.మణిపూర్‌లో బహిరంగంగా ప్రదర్శించబడిన చివరి హిందీ చిత్రం 1998లో ‘కుచ్ కుచ్ హోతా హై అని హెచ్‌ఎస్‌ఏ తెలిపింది.

హిందీ చిత్రాల ప్రదర్శనపై నిషేధం..( Manipur Theatres)

రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (ఆర్పీఎఫ్) అనే తిరుగుబాటు సంస్థ సెప్టెంబర్ 2000లో హిందీ చిత్రాల ప్రదర్శనపై నిషేధం విధించింది.సెప్టెంబర్ 12న నిషేధం విధించిన వారం రోజుల్లోనే రాష్ట్రంలోని అవుట్‌లెట్ల నుంచి సేకరించిన హిందీలో 6,000 నుంచి 8,000 వీడియో, ఆడియో క్యాసెట్లు, కాంపాక్ట్ డిస్క్‌లను తిరుగుబాటుదారులు తగులబెట్టారని అధికారులు తెలిపారు.ఈ నిషేధానికి ఆర్పీఎఫ్ ఎటువంటి కారణం చెప్పనప్పటికీ, రాష్ట్ర భాష మరియు సంస్కృతిపై బాలీవుడ్ ప్రతికూల ప్రభావం చూపుతుందని తీవ్రవాద సంస్థ భయపడుతున్నట్లు కేబుల్ ఆపరేటర్లు తెలిపారు.

మరోవైపు జాతి హింస కారణంగా నిరాశ్రయులైన 3,000 కుటుంబాలకు ఆశ్రయం కల్పించేందుకు గృహాలను వేగంగా నిర్మిస్తున్నారు. హింసాత్మక ఘటనల కారణంగా నిరాశ్రయులైన వారిలో చాలా మంది మూడు నెలలకు పైగా తాత్కాలిక సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.జూన్ 26 నుండి ఐదు వేర్వేరు ప్రదేశాలలో నిర్మాణం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం సాయంతో ఈ గృహాలను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి మేము సమయంతో పోటీ పడుతున్నామని మణిపూర్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి బ్రోజేంద్రో తెలిపారు.