Last Updated:

Chennai posters: చెన్నై వీధుల్లో డిక్టేటర్ రవి, గెట్ అవుట్ రవి అంటూ పోస్టర్లు

: తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య మరోసారి పోస్టర్ వార్ మొదలైంది.అధికార డీఎంకే కార్యకర్తలు శనివారం చెన్నై వీధుల్లో #DictatorRavi మరియు #GetOutRavi అనే హ్యాష్‌ట్యాగ్‌లతో గవర్నర్ వ్యతిరేక పోస్టర్‌లు వేశారు

Chennai posters: చెన్నై వీధుల్లో డిక్టేటర్ రవి,  గెట్ అవుట్ రవి అంటూ పోస్టర్లు

Chennai posters: తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య మరోసారి పోస్టర్ వార్ మొదలైంది.అధికార డీఎంకే కార్యకర్తలు శనివారం చెన్నై వీధుల్లో #DictatorRavi మరియు #GetOutRavi అనే హ్యాష్‌ట్యాగ్‌లతో గవర్నర్ వ్యతిరేక పోస్టర్‌లు వేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ నిలిపివేస్తే అది చనిపోయినట్లేనని ఆర్‌ఎన్ రవి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఈ పోస్టర్లు వెలిసాయి.

బిల్లులను నిలిపివేయడం పనికిమాలిన చర్య..(Chennai posters)

గవర్నర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్పందిస్తూ, రవి బిల్లులను నిలుపుదలలో ఉంచలేరని గతంలో అన్నారు. ఇది పనికిమాలిన చర్య, ఒత్తిడి పెంచితే, గవర్నర్ ఒక ప్రశ్న వేసి ప్రభుత్వానికి తిరిగి పంపుతారుదీనితో, అతని డ్యూటీ పూర్తవుతుందని ఆయన అన్నారు.రాజ్‌భవన్‌లో ‘థింక్ టు డేర్’ సిరీస్ కోసం సివిల్ సర్వీస్ ఔత్సాహికులతో తన ఇంటరాక్షన్ సందర్భంగా తనకు పంపిన అసెంబ్లీ బిల్లులపై రవి వ్యాఖ్యానించారు.గవర్నర్‌కు మూడు ఎంపికలు ఉన్నాయి. ఆమోదం ఇవ్వడం, నిలిపివేయడం మూడవది బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేయడం. ఇది గవర్నర్ విచక్షణ అంటూ పేర్కొన్నారు.

జనవరిలో కూడా పోస్టర్లు ..

రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి బిల్లులను ధైర్యంగా ఆమోదించకుండా లేదా వ్యతిరేకించకుండా నిలుపుదల చేయడం తగదని స్టాలిన్ అన్నారు. ప్రజాప్రతినిధులు తలపెట్టిన బిల్లులు, ఆర్డినెన్స్‌లు, సవరణలను కాలయాపన చేయడం గవర్నర్‌కు అలవాటుగా మారిందని ఆయన పేర్కొన్నారు. అయితే గవర్నర్‌కు వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం పోస్టర్లు వేయడం ఇదే తొలిసారి కాదు.అంతకుముందు, జనవరిలో, తమిళనాడు అసెంబ్లీలో అధికార డిఎంకె నేతృత్వంలోని ప్రభుత్వానికి మరియు గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య భారీ ప్రతిఘటన జరిగిన తరువాత పోస్టర్ వార్ జరిగింది. డిఎంకె ప్రభుత్వం #GetOutRavi అని పేర్కొంటూ పోస్టర్లు మరియు హ్యాష్‌ట్యాగ్‌లను ఉంచడంతో సభ యొక్క ఉన్నత-స్థాయి డ్రామా త్వరలో నగరంలోని వీధుల్లోకి చేరుకుంది.

తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంతకు చెందిన స్టెరిలైట్ కాపర్ కర్మాగారాన్ని మూసివేయడానికి దారితీసిన నిరసన “విదేశీ నిధులతో” జరిగిందని, అందులో పాల్గొన్న వ్యక్తులు విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం కింద నిధులు పొందుతున్నారని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి గురువారం అన్నారు.వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ యాజమాన్యంలోని స్టెరిలైట్ కాపర్ కర్మాగారం 2018 లో నిరసన సమయంలో పోలీసుల కాల్పుల్లో 13 మంది మరణించడంతో మూసివేయబడింది. ప్లాంట్ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందంటూ స్థానికులు నిరసనకు దిగారు.